టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఈ అందాల భామ తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. మంచి మంచి సినిమాలలో నటిస్తూ తక్కువ సమయంలోనే గొప్ప గుర్తింపు సొంతం చేసుకుంది. నేడు ఈ బ్యూటీ పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది అభిమానులు, సినీ ప్రముఖుల నుండి ఈమెకి విషెస్ వచ్చాయి. అయితే మీనాక్షీ చౌదరి తన జన్మదినాన్ని అభిమనులతో కలిసి జరుపుకుంది. తెలుగు ప్రేక్షకులు తనకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పి, కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు చెప్తూ సెలబ్రేట్ చేశారు. దీంతో ఆమె స్టేజ్ పైననే ఎమోషనల్ అయింది. అభిమానులు తనపైన చూపిస్తున్న ఆదరణ చూసిన మీనాక్షీ చౌదరి.. స్టేజ్ పైననే వారందరికీ థాంక్స్ చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈమె ఇటీవల స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సందడి చేసింది. ఈ సినిమాలో దుల్కర్ కి జోడీగా మీనాక్షీ చౌదరి నటించి ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతి వస్తున్నాం మూవీలో కూడా నటించి హ్యాట్రిక్ కొట్టేసింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, వెంకటేష్ కి ప్రియురాలి పాత్రలో నటించి మంచి గుర్తింపును సాధించింది. ఈ సినిమాకు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి దుమ్ము లేపింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈమె ఓ పంజాబీ ఫ్యామిలీలో జన్మించింది. మీనాక్షి చౌదరి నటి మాత్రమే కాదు. ఈమె రాష్ట్ర స్థాయి స్విమ్మర్, బ్యాడ్మింటన్ ప్లేయర్, అలాగే డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ కూడా పూర్తి చేశారు. ఫేమినా మిస్ ఇండియా విజేతగా కూడా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: