
అందుకే ప్రశాంత్ వర్మ సినిమా విషయంలో కాస్త టైం తీసుకునేలా ఉన్నాడని తెలుస్తుంది. సో చూస్తుంటే జై హనుమాన్ 2025 కాదు 2026 దాకా ఇంకా లేట్ అయితే మరో ఏడాది అంటే 2027 దాకా తీసుకెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని తెలుస్తుంది. హనుమాన్ సినిమా అంటే తేజా సజ్జా తో పాటు మిగతా సీజీ వర్క్ తో పూర్తి చేశాడు ప్రశాంత్ వర్మ. కానీ రిషబ్ శెట్టితో చేస్తున్న జై హనుమాన్ మాత్రం అంత తేలికగా పూర్తయ్యే పరిస్థితి కనిపించట్లేదు.అందుకే ఈ సినిమా అనుకున్న టైం కన్నా లేట్ గా వచ్చేలా ఉందని తెలుస్తుంది. ఐతే లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తుందన్నట్టుగా ప్రశాంత్ వర్మ మాత్రం జై హనుమాన్ విషయంలో కూడా లెక్క ఏమాత్రం తగ్గకుండా ఉండేలా చూసుకుంటున్నాడని తెలుస్తుంది.రిషబ్ శెట్టి ప్రస్తుతం ‘కాంతార 2’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. కన్నడ హీరో అయినా రిషబ్ శెట్టి కాంతార సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన అందర్నీ ఆకట్టుకుంది. కాంతార సినిమాకు కాను జాతీయ అవార్డు కూడా అందుకున్నారు రిషబ్ శెట్టి.