
రాను రాను టాలీవుడ్ సినిమా నిర్మాణం మరింత భారం అయ్యేలా ఉంది. ఒక వైపు సినిమాలో అట్టర్ ప్లాప్ అవుతున్నాయి .. డిజాస్టర్లు అవుతున్నాయి. హీరోలు మాత్రం కోట్లకి కోట్లు రెమ్యూనిరేషన్ తీసుకుంటూ నిర్మాతలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఇక సినిమా బడ్జెట్ అస్సలు కంట్రోల్ లో ఉండటం లేదు. మొదటి సినిమాతో ఓ మాదిరి హిట్టు కొట్టిన దర్శకుడు రెండవ సినిమాకు అడిగిన బడ్జెట్ చూసి ఓ నిర్మాతకు కళ్ళు తిరిగాయట. సరే అన్నింటికీ ఓకే అని .. నిర్మాత ముందు వచ్చి సినిమా చేశాక చివరికి ఆయనకు మిగిలింది ఏందయ్యా అంటే అప్పు తెచ్చిన డబ్బులకి వడ్డీలు కట్టడానికి మరోసారి అప్పు చేయడమే .. టాలీవుడ్ లో మరో సంస్కృతి మొదలైంది. అదే పోస్టర్స్ పిచ్చి సినిమా డిజాస్టర్ అయినా సరే మొదటి రోజు మాత్రం బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని పోస్టర్ పడాలి లేదంటే అభిమానుల నుంచి వచ్చే ట్రోలింగ్ అంతా కాదు గత ఏడాది రిలీజ్ అయిన ఓ పెద్ద సినిమాకు వందల కోట్ల పోస్టర్లు వదిలారు.
కానీ ఆంధ్రాలో కొన్ని ఏరియాలలో పరిస్థితి సంక్రాంతి కానుకగా వచ్చిన పాన్ ఇండియా సినిమా పరిస్థితి మరీ ఘోరం. మొదటి రోజు బెనిఫిట్ షో లు కూడా ఫుల్ కాలేదు. అయినా మొదటి రోజు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పోస్టర్ రిలీజ్ చేసి నవ్వుల పాలయ్యారు. ఇక మరో మిడిల్ రేంజ్ హీరో సినిమా పరిస్థితి కూడా అటు ఇటుగా అదే సేమ్ .. ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు నానా కష్టాలు పడింది .. కానీ హీరోలం ఎక్కువ కోసం మన నిర్మాతలు వందల కోట్ల రూపాయల పోస్టర్లు వేస్తున్నారు. వరుసగా మూడు ప్లాపులు కొట్టిన హీరో ఎప్పటికీ తన రెమ్యూనరేషన్ 30 కోట్లకు పైనే తీసుకుంటున్నాడు. ఇక సీనియర్ హీరో సంగతి అయితే చెప్పక్కర్లేదు. 100 కోట్లకు కాస్త దగ్గరగా లేనిదే ఆయన సినిమా చేయరు. ఇదంతా సదర్ హీరోలు భారీ కలెక్షన్లు రాబడతారా ? అంటే మొదట ఆటకే వారి సినిమా ఆడుతోన్న థియేటర్లు ఖాళీ అయిపోతున్నాయి .. కానీ పోస్టర్లు మాత్రం వందల కోట్లు దాటేస్తున్నాయి.. దీంతో నిర్మాతలకు వచ్చేదానికంటే పోయే లెక్క ఎక్కువగా కనిపిస్తోంది.