
ఇప్పటికే ఇండియన్ చిత్ర పరిశ్రమంలో.. రెండు దశబ్దల సినీ జీవితంలో.. భారీ డిమాండ్ తో కొనసాగుతుంది స్టార్ బ్యూటీ త్రిష. ఈమె నటించే ఒక్కో సినిమాకు రూ.10 నుంచి రూ.12 కోట్ల వరకు పారితోషకం అందుకుంటుంది. ఇక చిరంజీవితో నటుతున్న విశ్వంభర సినిమా కోసం ఏకంగా త్రిష రూ.12 కోట్ల వరకు అందుకుంటుందట. ఇక లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న నయనతార కూడా సౌత్ నుంచి బాలీవుడ్ వరకు భారీ స్థాయిలో అభిమానులను దక్కించుకుంది. ఈమె బాలీవుడ్లో నటించిన జవాన్ సినిమాకు గాను రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంది. ఈమె పెళ్లి తర్వాత డాక్యుమెంటరీ హక్కులను నెట్ఫ్లిక్స్లో అమ్మడం ద్వారా.. రూ.25 కోట్ల వరకు ఈమె సంపాదించిందని అంటున్నారు.
మరో పాన్ ఇండియా బ్యూటీ సమంత కూడా ఈమె నటించే ఒక్కో సినిమాకు రూ.3 నుంచి 8 కోట్ల వరకు వారితోష్కం అందుకుంటుంది. బాలీవుడ్లో నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్కు గాను.. ఈమె క్యారెక్టర్ కు రూ.10 కోట్ల వరకు పారితోషకం అందుకుంది. కెరీర్లో ఇప్పటివరకు ఈమె తీసుకున్న అత్యధిక మొత్తం ఇదే. రీసెంట్గా వరుస విజయాలు అందుకుంటున్న సాయి పల్లవి కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ అందుకుంది. ఈమె కూడా ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తుంది . ప్రస్తుతం ఈమె బాలీవుడ్లో రామాయణం సినిమాకు రూ.20 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుందట. దీంతో మన సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుని హీరోయిన్గా సాయి పల్లవి రికార్డు క్రియేట్ చేసింది.