సందీప్ కిషన్ తాజాగా మజాకా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అందాల ముద్దుగుమ్మ రీతూ వర్మ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... త్రినాథ్ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రావు రమేష్ , అన్షు ఈ మూవీ లో కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ ని ఫిబ్రవరి 26 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 8 రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయింది. 8 రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

8 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 1.78 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 76 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 2.98 కోట్ల కనెక్షన్లు దక్కాయి. మొత్తంగా 8 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.62 కోట్ల షేర్ ... 8.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక 8 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 89 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 8 రోజుల్లో 5.51 కోట్ల షేర్ ... 11 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ 11.20 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 5.69 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లను వసూలు చేస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇకపోతే మజాకా మూవీ దర్శకుడు అయినటువంటి త్రినాద్ రావు నచ్చిన ఈ మూవీ కంటే ముందు ధమాకా అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని కూడా పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కించాడు. ఈ మూవీ మాత్రం బాక్సా ఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. ఇక మజాకా మూవీ మాత్రం బాక్సా ఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను వసూలు చేయడంలో చాలా వరకు విఫలం అయినట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk