రాజమౌళి.. ఏ పని చేసిన సరే వేరే లెవెల్ లో ఆలోచించి చేస్తూ ఉంటారు . దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు.  ఇప్పుడు మహేష్ బాబుతో సినిమాని తెరకెక్కించబోతున్నాడు . ఈ సినిమా కోసం ఎంతలా కష్టపడుతున్నాడో సినిమా టీం ని ఎంతలా కష్టపెడుతున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే.  కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఈ న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ గా వైరల్ గా అవుతుంది. మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో తెరకెక్కే  సినిమాలో బోలెడు మంది హీరోయిన్స్ ని గెస్ట్ రోల్ లో చూపించబోతున్నారట .


అంతేకాదు ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట . కాగా ఈ సినిమాల్లో మహేష్ బాబు క్యారెక్టర్ పేరు "రుద్ర" అంటూ బయటపడింది . అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయెల్ షేడ్స్ లో కనిపించబోతున్నారట . మహేష్ బాబు  ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే టైం లో చనిపోతాడట.  ప్రజెంట్ జన్రేషన్ లో ఉండే మహేష్ బాబు మాత్రమే బ్రతికి ఉండేలా ఆయన క్యారెక్టర్ రాసుకున్నారట . గతంలో మగధీర సినిమాలో రామ్ చరణ్ ని అదే విధంగా బాహుబలి సినిమాలో ప్రభాస్ ని ఎలా క్యారెక్టర్ పరంగా చంపేశాడో అందరికీ తెలిసిందే.



సేమ్ టు సేమ్ అదే స్ట్రాటజీ ఫాలో అవుతూ ఆయన మహేష్ బాబును చూపించబోతున్నారట . ఇది నిజంగా మహేష్ బాబు కెరియర్ ని  మలుపు తిప్పే విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు జనాలు. మొత్య్తానికి మహేష్ బాబు సినిమాని వేరే లెవల్ లో ప్లాన్ చేశాడు జక్కన్న అని అర్ధమైపోయింది. ఇక మిగిలింది పాత రికార్డ్స్ బద్ధలు అవ్వడమే ..గెట్ రెడి అంటున్నారు ఫ్యాన్స్. చూద్దాం అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో..? ఎల అభిమానులని ఆకట్టుకుంటుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: