
షూటింగ్ మొదలై నెల రోజులు అవుతున్న ఎక్కడ జరుగుతుంది ఏ షూ చేస్తున్నారని అప్డేట్ కూడా బయటికి రాకుండా ఎంతో పగడ్ బందీగా ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా షూటింగ్ పై కీలక అప్డేట్ బయటకు వచ్చింది . ఈ షూటింగ్ మొదలైన రోజు నుంచి సిటీ దాటి బయటకు వెళ్లలేదు చిత్ర యూనిట్ . రామోజీ ఫిలిం సిటీ తో పాటు కొన్ని సన్నివేశాలు అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించాడు రాజమౌళి. ఇప్పటివరకు జరిగిన షెడ్యూల్స్లో మహేష్ బాబు తో పాటు ప్రియాంక చోప్రా , జాన్ అబ్రహం కూడా పాల్గొన్నాటు తెలుస్తుంది .. అయితే ఇప్పుడు మొదటిసారిగా ఈ సినిమా కోసం హైదరాబాద్ దాటారు చిత్ర యూనిట్ ..
మహేష్ , రాజమౌళి సినిమా యూనిట్ అంతా ప్రస్తుతం ఒడిశాలో ఉన్నారు. అలాగే రాబోయే మూడు వరల పాటు అక్కడే షూటింగ్ జరగనుంది .. అక్కడ ఉన్న డిడియోమాలి, తలమాలి, కాళ్యమాలి అటవీ ప్రాంతాల్లో 23 రోజుల షెడ్యూల్లో ప్లాన్ చేశాడు జక్కన్న . కోలాబ్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ జరుగుతుంది .. ఇప్పటికే రాజమౌళి ఒడిశా హోటల్లో దిగిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. అలాగే ఈ మహేష్ బాబు సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం నటించబోతున్నాడు అంటూ తెలుస్తుంది .. అంతర్జాతీయ ప్రమాణికాలతో ఈ సినిమాని తెర్కక్కిస్తున్నాడు రాజమౌళి .. ఈ సినిమా టాకీ ని ఈ సంవత్సరంలోనే పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ టైం తీసుకోవాలని చూస్తున్నాడు రాజమౌళి ... అన్ని కుదిరితే 2027లో ఈ మహేష్ , రాజమౌళి సినిమా రిలీజ్ అవ్వటం ఫిక్స్ .