నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు సినిమాకు సపరేట్ అభిమానులు ఉన్న విషయం తెలిసిందే .. ఈ సినిమాకు ఇప్పటికే యూత్లో భారీ క్రేజీ ఉంది .. టాలీవుడ్ లో వచ్చిన ఎన్నో లవ్ స్టోరీ సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి .. బాక్సాఫీస్ దగ్గర భారీ రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదలై నేటికీ 20 ఏళ్లు పూర్తయింది . కానీ ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్లో మిలియన్ కొద్ది వ్యూస్ తెచ్చుకుంటున్నాయి .. డైరెక్టర్ విజయభాస్కర్ తెర్కక్కించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయం అందుకుంది . దర్శకుడు త్రివిక్రమ్ స్టోరీ డైలాగ్స్ అందించిన ఈ సినిమా నాగార్జున కెరీర్ లోని వన్ అఫ్ ది బెస్ట్ క్లాసికల్ సినిమాగా నిలిచింది .. ఈ సినిమాలో నాగార్జునతో పాటు సోనాలి బింద్రే , అన్షు అంబానీ హీరోయిన్లుగా నటించారు .. ఈ సినిమా తోనే కుర్రాళ్ళు మనుసులను కట్టిపడేసింది అన్షు .
 

తొలి సినిమా తోనే ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం తెచ్చుకుంది . అలాగే ఈ సినిమాకి ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది . మన్మధుడు సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత ప్రభాస్ నటించిన రాఘవేంద్ర సినిమాలోను నటించింది .  అయితే ఈ రెండు సినిమాల్లోని ఈమె పాత్ర చనిపోతుంది .. అయితే ఆ తర్వాత కూడా ఈమె అలాంటి పాత్రలే రావటం తో సినిమాలకు దూరంగా వెళ్లిపోయింది .. దాదాపు 15 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న అన్షు .. రీసెంట్ గానే మజాకా సినిమాతో మరోసారి రియంట్రి ఇచ్చింది .

 

సినిమాలకు దూరంగా వెళ్లిన తర్వాత లండన్ కు చెందిన సచిన్ సగ్గార్ ను పెళ్లి చేసుకుంది వీరీకి బాబు పాప ఉన్నారు .. ప్రస్తుతం లండన్లోఇన్‌స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాప్ నిర్వహిస్తుంది ఇదిలా ఉంటే ఇప్పుడు ఇటీవల మజాకా మూవీ ప్రమోషన్ లో తన కూతురితో సందడి చేసింది అన్షు . వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.   అన్షు కూతుర్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు .. తల్లిని మించిన అందంతో ఆమె అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: