ఒక్కసారి మంచి స్టార్డం వచ్చిందంటే అది అలాగే ఉంటుంది .. ఎన్ని కోట్లు ఇవ్వడానికైనా నిర్మాతలు రెడీ అవుతారు ప్ర‌స్తుతం ఇదే స్టేటస్ను ఎంజాయ్ చేస్తుంది సాయి పల్లవి .. ఆమె రెమ్యూనరేషన్ ఒక్కసారిగా నాలుగు రేట్లు పెరిగిపోయిందనేది బాలీవుడ్ మాట. తెలుగులో తండేల్‌ సినిమా చేసిన సాయి పల్లవి ఆ సినిమాకు హీరో నాగ చైతన్యతో సమానంగా రెమ్యూనరేషన్ అందుకుంది అంటూ టాక్ కూడా ఉంది .  అలాగే తండేల్ సినిమాకు సాయి పల్లవి అందుకున్న రెమ్యూనరేషన్ ఐదు కోట్ల రూపాయలు .. ఇదే టైంలో ఆమె బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ కు కమిట్ అయింది .. ప్రజెంట్ రన్బీర్ కపూర్ తో కలిసి రామాయణం సినిమా చేస్తుంది . ఈ సినిమాలో నటించడానికి ఆమె 18 కోట్ల నుంచి 20 కోట్ల వరకు తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియా కథనం . ఈ విధంగా చూసుకుంటే సాయి పల్లవి రెమ్యూనరేషన్ నాలుగు రేట్లు పెరిగిపోయిందనేది వాస్తవం .


ఇక ఈ స్థాయిలో కాకపోయినా నయనతార , సమంత లంటి హీరోయిన్లు కూడా కాస్త గట్టిగానే లాగుతున్నారు .. ఇక నయనతార విషయానికి వస్తే గతంలో ఆమె 6 కోట్లు తీసుకునేది .. అప్పట్లో సౌత్ లోనే అత్యధిక పారితోషం తీసుకున్న హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది .. ఇప్పుడు 10 కోట్ల వరకు తీసుకుంటుందట . సమంత విషయానికి వస్తే శకుంతల సినిమాకు ఈమె తక్కువగానే తీసుకుంది.   ఇక ఖుషి సినిమాకు మాత్రం అటు ఇటుగా మూడు కోట్లు తీసుకుంది .. బాలీవుడ్లో సిటాడెల్  వెబ్ సిరీస్ గాను 8 కోట్ల వరకు వసూల్‌ చేసింది .. వీటి కంటే కాస్త ఎక్కువ రెమ్యూనరేషన్ రక్త బ్రాహ్మండ్‌ సిరీస్ కోసం అందుకుంటుంది .. తన తర్వాత ప్రాజెక్టుకు సమంత పది కోట్ల వరకు తీసుకోవటం పక్క .


అనుష్క , రష్మిక కూడా భారీగానే పారితోషకం తీసుకొనే లిస్టులో ఉన్నారు .. అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు చేస్తుంది అనుష్క అలా అప్పుడప్పుడు చేసిన తను తీసుకునే ఫీజు మాత్రం మూడు నుంచి 6 కోట్ల వరకు తక్కువ కాకుండా ఉంటుంది . ఇక రష్మిక అయితే ఒక్కో సినిమాకు తన రేట్ పెంచుకుంటూ వెళ్లిపోతుంది .. పుష్పా2 సినిమాకు గాను 10 కోట్లు తీసుకుంది .  అలాగే చావా  సినిమాకు మాత్రం ఆమె 4 కోట్లు మాత్రమే తీసుకుందని టాక్ .. ఇలా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో నటిస్తున్న సికిందర్ కు ఈమె నాలుగు కోట్ల వరకు తీసుకుందట .. ఇలా ఈ విధంగా చూసుకుంటే సౌత్ హీరోయిన్ల కూడా తమ ఫీజులు ఈ మధ్య గట్టిగానే పెంచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: