
డాకు మహారాజు సినిమా వరల్డ్ వైస్ గా ఒక సరికొత్త ట్రెండు ని సెట్ చేసింది.. అందుకే బాలయ్య ,బోయపాటి కాంబినేషన్లో వస్తున్నటువంటి అఖండ 2 చిత్రాన్ని ఒక ప్రముఖ ఓటీటీ సమస్త తీసుకోవాలని పట్టుపడుతోందట. డాకు మహారాజ్ సినిమా కన్నడ, తమిళ్, హిందీ వర్షన్ లో కలిపి సుమారుగా 60 కోట్ల వరకు ఓటిటి డీల్ జరిగినట్లుగా వార్త వినిపించాయి. అయితే ఇప్పుడు ఏకంగా అఖండ 2 పాన్ ఇండియా లెవెల్లో పలు భాషలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో 80 కోట్ల వరకు ఈ సినిమాని ఓటీటీ డీల్ సెట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
చాలా సంస్థలే అఖండ 2 డిజిటల్ హక్కులను సైతం తీసుకోవడానికి పోటీ పడుతున్నారట 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్న ఈ అఖండ 2 సినిమా ఓటిటి డీల్ సెట్ అయితే దాదాపుగా సగం బడ్జెట్ నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే కవర్ అవుతాయని అభిమానులు భావిస్తూ ఉన్నారు.. మరి కలెక్షన్స్ పరంగా ఏ విధంగా అఖండ 2 ఆకట్టుకుంటుందో చూడాలి మరి. ఇందులో హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తూ ఉన్నది. అఖండ సినిమాలో నటించిన వారందరూ కూడా నటించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.