
అలాగే ప్రభాస్ ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారు .. షూటింగ్ సెట్లో అందరితో సరదాగా ఉంటారు .. అంటూ నిధి అగర్వాల్ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది . ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు .. మాళవిక మోహనన్ , రిద్ధి కుమార్ హీరోయిన్ల గా నటిస్తున్నారు .. మ్యూజిక్ సన్సేషన్ తమన్ సంగీతమందిస్తున్నారు .. ప్రస్తుతం ఈ సినిమా కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంతో శరవేగంగా జరుగుతున్నాయి .. ఈ సినిమా ఎడిటింగ్ టేబుల్ పై ఇప్పటికే మూడున్నర గంటల సినిమా నిడివి ఉందని .. ప్రజెంట్ ఎడిటింగ్ భాగం ఆ నిడివి తగ్గించే పనిలో ఉందని తెలుస్తుంది .
ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు .. ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు కూడా ఉన్నాయి .. ఈ సినిమా రిలీజ్ డే విషయంలో మాత్రం ఎన్నో అనుమానాలు వస్తున్నాయి .. ఈ సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది .. అనుకోని కారణాల తో ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో వాయిదాల పర్వం నడుస్తూనే ఉంది . అయితే ఇప్పుడు ఈ సినిమా దసరా తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుందని తాజా సమాచారం .