
పుష్ప 2 చిత్రానికి వచ్చిన లాభాలను జానపద కళాకారులకు సైతం పింఛనీ కోసం ఉపయోగించాలి అంటూ లాయర్ నరసింహారావు హైకోర్టులో పిటిషన్ వేసినట్లుగా తెలుస్తోంది. పుష్ప 2 సినిమాకి భారీగా లాభాలు వచ్చాయని ఈ విషయాన్ని నిర్మాతల స్వయంగా ప్రకటించారని ఆయన కోర్టుకు వివరించారు.. నిజానికి పుష్ప చిత్రానికి ఇంత లాభాలు రావడానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి బెనిఫిట్ షోలు అధిక టికెట్టు ధరల వల్లే కారణమని తెలిపారు.
ప్రభుత్వ సహకారంతోనే ఇంతటి లాభాలను అందుకున్న పుష్ప 2 చిత్రానికి వచ్చిన లాభాలను సుప్రీం కోర్టు రూల్స్ ప్రకారం జానపద కళాకారులకు పింఛనీ కోసం మళ్ళించాలంటూ లాయర్ నరసింహారావు పిటిషన్ వేశారట. ఎందుకు జానపద కళాకారులకు కూడా హక్కు ఉందంటూ నరసింహారావు వెల్లడించారు. కానీ ఆ లాభాలు ఎప్పుడో అయిపోయిందిగా అంటూ కోర్టు ప్రశ్నించగా దీనికోసం ఇప్పుడు ఫీల్ వేసినట్లు నరసింహారావు వెల్లడించారట. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా సబ్మిట్ చేయడానికి రెండు వారాల దాకా గడువు అడిగారట. ఇప్పుడు ఈ విషయం పైన టాలీవుడ్ అంతట హాట్ టాపిక్ గా మారుతున్నది. ఇప్పటికే పుష్ప 2 సినిమా గురించి అందరూ కూడా వివాదాల విషయంలో మరిచిపోతున్న సమయంలో ఇప్పుడు మళ్లీ వాటాల గురించి ఫీల్ చేయడంతో మరి ఏం జరుగుతుందో చూడాలి.