అక్కినేని అఖిల్ కు ఏజెంట్ సినిమా ఇచ్చిన షాక్ తర్వాత .. అఖిల్ చేయబోయే సినిమా షూటింగ్ ఈనెల 14 నుంచి మొదలు కాబోతుంది .. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సినిమాకు నందు దర్శకుడు .. గతంలో తిరుపతి బ్యాక్ డ్రాప్ లో వినురో భాగ్యము విష్ణు కథ అనే సినిమాను తీసి హిట్‌ అందుకున్నాడు . అయితే నిజానికి ఈ సినిమా కథను ముందుగా నిర్మాత సాహు గారపాటి రాయించుకున్నారు .. అయితే ఈ కథ గురించి విని నాగార్జున దానిని తనకు కావాలని రిక్వెస్ట్ చేసి తీసుకున్నారు ..

ఇక తమ కుటుంబానికి విలేజ్ బాక్ డ్రాప్ సినిమాలు కలిసి వస్తాయని అఖిల్ కి కూడా అలాంటి సినిమా కావాలని ఎప్పటినుంచో చూస్తున్నానని చెప్పి ఈ సినిమాను తన సొంత బ్యానర్ మీద నిర్మిస్తున్నాడు నాగార్జున .  ఇక ఈ సినిమా ఈనెల 14న హైదరాబాదులో మొదలు కాబోతుంది .. ఎక్కువ భాగం షూటింగ్ కూడా చిత్తూరు జిల్లాలో జరగబోతుంది .. అలాగే ఈ సినిమాలో చిత్తూరు మాట పలుకుబడి కూడా ఉంటుందట .. చిత్తూరు ప్రాంతంలోని భారతం మెట్ట అనే ఒక కొండ ప్రాంతం ఉంది .. అక్కడ ఎక్కువ షూటింగ్ ఉండబోతుంది .


ఇక నాగార్జున  నిర్మాతగా అఖిల్ కోసం చేస్తున్న రెండో సినిమా ఇది .. గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేశారు .. అఖిల్ హీరోగా ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేశారు .. కానీ ఒకటి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగా హిట్ కాలేదు .. ఇక మరి ఈ సినిమాతో అయినా ఈ అక్కినేని హీరో హిట్‌ అందుకుంటానని గట్టి నమ్మకంతో ఉన్నారు .. యువి క్రియేషన్స్ కూడా అఖిల కోసం ఓ పోస్ట్ ప్రాజెక్ట్ సెట్ చేసి ఉంచింది .. ఈ సినిమాలతో అయినా ఈ అక్కినేని హీరో తానేంటో చూపించుకుంటాడో లేదో చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: