తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో ఎంతో ప్రెస్టీజియస్ సినిమాగా తెరకెక్కుతున్న మహేష్ , రాజమౌళి సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కొత్త గా చెప్పాల్సిన పనిలేదు .. ఈ సినిమా ను దర్శక ధీరుడు గ్లోబల్ మూవీ  గా ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాడు .. ఇప్పటికే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎంతో వేగంగా జరుపుకుంటుంది .. అయితే ఈ సినిమా కు సంబంధించిన రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ..


అయితే ఇప్పుడు తాజా గా ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ వార్త మూవీ సర్కిల్స్ లో గట్టి గా వినిపిస్తుంది .. ఈ సినిమా కథ కాశీ నగరం లో మొదలవుతుందని . అలా అడవులకు ఈ కథ మారుతూ వెళుతుంద ని  తెలుస్తుంది .. అలాగే ఈ మూవీ కథ కాశీ చరిత్రకు సంబంధించిందిగా ఉండనుంది. పురాణాలకు, నేటి కాలానికి ముడిపెడుతూ సినిమా సాగుతుంది.  అలాగే రామాయణంలో హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చే ఘట్టం ఈ కథకు ప్రధాన స్ఫూర్తి అని తెలుస్తోంది. ఇక దీంతో కాశి లో జరగబోయే సన్నివేశాల కోసం ప్రస్తుతం హైదరాబాదులో కాశీ కి సంబంధించిన సెట్ వేస్తున్నట్లు వార్తలు  వినిపిస్తున్నాయి ..


ఇక దీంతో ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది అసలు కాశీ నగరానికి ఈ సినిమా కథ కు ఎలాంటి సంబంధం ఉండబోతుందా అనే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా మారింది .. ఇక ఈ సినిమా లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండ గా .. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక  పాత్ర లో నటిస్తున్నారు .. అలాగే ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ను ఎవ‌రు ఊహించని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు .. ఇక మరి రాజమౌళి , మహేష్ తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతున్నారో  చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: