
త్వరలోనే డైరెక్టర్ నందిని రెడ్డి హీరోయిన్ సమంత కాంబోలో సినిమా రాబోతున్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. అంతేకాదు సమంత నిర్మాణం లోనే ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది . సమంత సొంత ప్రొడక్షన్ ట్రాలాలా మూవీ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆల్మోస్ట్ ఆల్ అఫీషియల్ టాక్ బయటకు వచ్చేసింది . అయితే ఈ సినిమా మొత్తం కూడా రీమేక్ కాకుండా ఒరిజినల్ స్క్రిప్ట్ తో తెరకెక్కబోతుందట. కాగా ఈ సినిమాకి బంగారం అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది .
ఈ సినిమాకి వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పురుషులకు ఎలాంటి వేతన్నం ఇస్తారో మహిళలకు కూడా అలాంటి వేతనం ఇవ్వాలి అంటూ సమంత నిర్ణయం తీసుకుందట . ఇప్పటివరకు సినిమా చరిత్రలో ఏ బడా ప్రొడెక్షన్ సంస్థ కానీ ఏ డైరెక్టర్ కానీ ఈ విధంగా చేయలేదట . ఫస్ట్ టైం సమంతనే ఇలాంటి నిర్ణయం తీసుకుందట . సమంత తీసుకున్న ఈ నిర్ణయం పై అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . ఇలాంటి నిర్ణయం సమంత తప్పితే మరి ఎవరు తీసుకోలేరని సమంత మంచి మనసుకే ఇది సాధ్యమని చెప్పుకొస్తున్నారు. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రిలో సోషల్ మీడియాలో సమంత తీసుకున్న ఈ నిర్ణయం బాగా వైరల్ గా మారింది . అంతే కాదు పెద్ద పెద్ద సినిమాలను తెరకెక్కించే రాజమౌళి - ప్రశాంత్ నీల్ - సుకుమార్ సైతం ఇలాంటి స్ట్రాంగ్ డెసీషన్ తీసుకోలేరు అని జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు..!