సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ రావచ్చు .. ఎంతమంది హీరోయిన్స్ అయిన ఉండొచ్చు . స్టార్ స్టేటస్ సంపాదించుకోవచ్చు . కానీ సావిత్రి - సౌందర్య - శ్రీదేవి లాంటి హీరోయిన్స్ ప్లేస్లను మాత్రం రీప్లేస్ చేసే వాళ్ళు ఎప్పటికీ రారు రాబోరు . ఆ విషయం అందరికీ తెలుసు . ఎంత తోపైన హీరోయిన్ వచ్చిన ఎంత యాక్టింగ్ చేసిన .. అరెరే అప్పట్లో సావిత్రి గారు ఇలానే నటించారే అని అనుకుంటారే కానీ సావిత్రిని మించిపోయిన రేంజ్ లో ఏ హీరోయిన్ నటన ఉంది అని మాత్రం ఎవ్వరు అనుకోరు .


ఆ విషయం అందరికీ తెలుసు . అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారి ట్రెండ్ అవుతుంది . గతంలో ఇండస్ట్రీలో స్టార్స్ గా ఉన్న సౌందర్య - శ్రీదేవి గార్ల తర్వాత అలాంటి క్రేజీ స్థానం అందుకున్న ఏకైక హీరోయిన్  సాయి పల్లవి అని అంటున్నారు అభిమానులు జనాలు . సావిత్రి గారు చాలా ట్రెడిషనల్ పాత్రల్లో మెప్పించి మైమరిపించి స్టార్ పొజిషన్ అందుకుంది . ఆ తర్వాత సౌందర్య శ్రీదేవి కూడా ట్రెడిషనల్ పాత్రలలో మెప్పించారు .



శ్రీదేవి హాట్ రోల్స్ లో కూడా చేసింది . కానీ ఎక్కడ వల్గారిటీని చూపించలేదు.  ఇప్పుడు సాయి పల్లవి సైతం అదే విధంగా ముందుకు వెళ్తుంది . సాయి పల్లవి అన్ని ట్రెడిషనల్ పాత్రలనే చూస్ చేసుకుంటుంది . అంతేకాదు టాలీవుడ్ - బాలీవుడ్ -కోలీవుడ్ -మాలీవుడ్ ఇండస్ట్రీలలో ఓ రేంజ్ లో ఆఫర్స్ దక్కించుకుంటుంది . ఒక్క ముక్కల్లో చెప్పాలి అంటే సావిత్రి - శ్రీదేవి - సౌందర్య ఫోటోల పక్కన కుర్చీ వేసి కూర్చునే అంత టాలెంట్ ఉన్న హీరోయిన్ సాయి పల్లవి అంటూ పొగిడేస్తున్నారు జనాలు . ఇది నిజంగా సాయి పల్లవికి దక్కిన ఓ స్పెషల్ క్రేజ్ అనే చెప్పాలి . ప్రెసెంట్ సాయి పల్లవి ఎలాంటి సినిమాలల్లో నటిస్తుందో ఎంత బడా స్టార్స్ తో కమిట్ అయిందో అందరికీ తెలిసిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి: