టాలీవుడ్ హీరోయిన్ సమంత మరొక హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బాటలోనే నడుస్తోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. అనుపమ అటు కోలీవుడ్లో మలయాళం లో తెలుగులో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది. డ్రాగన్ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ చిత్రంలో యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించారు. డ్రాగన్ చిత్రంలో అనుపమ పాత్ర చాలా కీలకంగా ఉన్నది. దీంతో ఈమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని కూడా చెప్పవచ్చు. దీనివల్లే అటు తెలుగులో కూడా వరుస ఆఫర్లు రావడం మొదలయ్యాయట. అలా తమిళంలో కూడా పలు చిత్రాలలో నటించేందుకు సిద్ధమయ్యిందట.


ప్రస్తుతం అనూపమా పరధా అనే చిత్రంలో నటిస్తూ ఉన్నది ఈ సినిమాతో మరొకసారి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడం జరుగుతుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు. అయితే ఈ చిత్రంలోనే సమంత కూడా గెస్ట్ రోల్ లో కనిపించేలా అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అనుపమ ,సమంతకు కూడా మంచి స్నేహబంధం ఉన్నదట. ఈ సినిమా కోసం అనుపమ స్వయంగానే సమంతని రిక్వెస్ట్ చేయడంతో ఆమె ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


సమంత సుమారుగా 10 నిమిషాల పాటు అనుపమ నటిస్తున్న పరధా సినిమాలో ఉండే అవకాశం ఉన్నదట. మరి ఈ విషయంపై చిత్ర బృందం ఇంకా అధికారికంగా క్లారిటీ ఇవ్వవలసి ఉన్నది. అనుపమ పరమేశ్వరన్ కూడా కెరియర్ ప్రారంభంలో డైరెక్టర్ త్రివిక్రమ్ తీసిన ఆ ఆ సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన అందులో హీరోయిన్గా కూడా సమంత నటించిన అప్పటినుంచి అటు సమంత ,అనుపమ మధ్య మంచి స్నేహబంధం ఉందని మళ్లీ ఆ తర్వాతే ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తున్నది. ఈ విషయం తెలిసి అభిమానులైతే ఆనంద పడుతున్నారు ఒకవేళ ఈ గెస్ట్ రోల్ సక్సెస్ అయితే అటు అనుపమ, సమంత కెరియర్ మారిపోతుందనే విధంగా  తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: