ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రతిరోజు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఓటీటీలు వచ్చినప్పటినుండి చాలా మంది థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడడం మానేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఎక్కువగా అందరి దృష్టి క్రేజీ సినిమాలపైనే ఉంది. ఇప్పుడు ఒక క్రేజీ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఆ సినిమా ఏంటో.. ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
 
ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన సోనీ లీవ్ లో రేఖాచిత్రం సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా మలయాళం సినిమా. కానీ ఈ సినిమా మంచి హిట్ కొట్టడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు మరో ఓటీటీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కేవలం తెలుగు బాషలో అందుబాటులోకి రానుంది. ఈ సినిమా ఈ ఏడాది జనవరి నెలలో విడుదల అయ్యింది. థియేటర్ లలో రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అలాగే రూ. 10 కోట్లతో నిర్మించిన ఈ సినిమా రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.

 
రేఖాచిత్రం సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీలోకి తెలుగు వెర్షన్ లో రిలీజ్ కానుంది. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా ఆహాలోకి రానుంది. ఇక ఈ సినిమా ఒక అమ్మాయి హత్యకి సంబంధించిన చిత్రం. ఈ సినిమాని డైరెక్టర్ జోఫిన్ టి. చాకో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని కావ్య ఫిల్మ్ కంపెనీ, ఆన్ మెగా మీడియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీలో ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్, మనోజ్ జయన్, సిద్దిక్, జగదీష్, సాయి కుమార్, హరిశ్రీ ముఖ్యపాత్రలలో నటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: