సౌత్ స్టార్ హీరో సూర్య చివరగా కంగువ‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు .. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రెక్ష‌కుల‌ను ఆకట్టుకోవటంలో ఫెయిల్ అయింది .. అయితే ఈ సినిమా ఇచ్చిన షాక్ తో అభిమానులు ఇప్పుడు సూర్య తర్వాత సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు .. అయితే ప్రస్తుతం సూర్య రేట్రో తన 45 సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నాడు .. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న సినిమా రేట్రో ఇక ఈ సినిమాలో సూర్య కు జంటగా హాట్ బ్యూటీ పూజా హెగ్డే నటిస్తుంది ..


అలాగే ఈ సినిమా షూటింగ్ పూర్తియి .. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి . అయితే ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 1న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు .. ఈ సినిమా తర్వాత మరో తమిళ దర్శకుడు నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య తన 45వ  సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో సూర్య డ్యుయల్ రోల్ లో నటించబోతున్నాడని కూడా తెలుస్తుంది .. ఈ సినిమా షూటింగ్ నవంబర్ 2024 లో మొదలైంది .. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతుంది .. అయితే ఈ సినిమా తర్వాత వాడివాసల్ సినిమాలో సూర్య నటించబోతున్నట్టు తెలుస్తుంది . అలాగే సూర్య టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది .


 తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యసినిమా చేయబోతున్నారట .. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు బయటకు వచ్చింది .. సూర్యా తో పాటు ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు నటించబోతున్నట్లు అప్డేట్ బయటకు వచ్చింది .. అందులో హీరోయిన్ల గా నీది అగర్వాల్, భాగ్యశ్రీ బోరుసే ఈ సినిమాలో నటిస్తున్నారట .. ఇప్పటికే వెంకీ అట్లూరు డైరెక్షన్ వచ్చిన సార్ , లక్కీ భాస్కర్ సినిమాలు భారీ విజయాలు అందుకున్నాయి . ఇప్పుడు సూర్యాతో వెంకీ చేస్తున్న సినిమాపై కూడా త్వరలోనే అధికార ప్రకటన బయటకు రానుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: