అక్కినేని నాగ చైతన్య ఇటీవలే తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఒక్కొక్క సినిమాకి సరికొత్త వేరియేషన్లలో ముందుకు వెళుతున్న నాగచైతన్య తండేల్ చిత్రంలో మత్స్యకారుడుగా కనిపించారు. నిరంతరం నాగచైతన్య పర్సనల్ లైఫ్ విషయం గురించి ఏదో ఒక విషయం వినిపిస్తూనే ఉంటుంది. మొదట హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఆ తర్వాత ఇద్దరు కొన్ని కారణాల చేత విడిపోవడం జరిగింది. అలా ఎవరు సినిమాలలో వారు బిజీగా ఉంటున్న సమయంలోనే నాగచైతన్య శో బితాతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత తమ రిలేషన్ ని తెలియజేస్తూ వివాహం చేసుకొని పెద్దల సమక్షంలో ఒకటయ్యారు శోభిత ,నాగచైతన్య.


అయితే నాగచైతన్య తొలిముద్దు ఎవరికి ఇచ్చారు అనే విషయం పై నాగచైతన్య చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. శోభిత పెళ్లి తర్వాత నాగచైతన్య హీరో రానా నిర్వహించినటువంటి ఒక టాక్ షోలో పాల్గొని పలు విషయాలను తెలియజేశారు. ఆ సమయంలో తన తొలిముద్దు అనుభవాన్ని నాగచైతన్య ఇలా తెలియజేస్తూ.. 9వ తరగతిలో ఒక అమ్మాయికి తాను మొట్టమొదటి ముద్దు ఇచ్చారనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఆ ముద్దు తన జీవితాంతం పనిచేస్తుందని విధంగా తెలియజేశారు నాగచైతన్య.


అలాగే ఒక అభిమాని తన దగ్గరకు వచ్చి సమంత కంటే మీరే తెల్లగా ఉన్నారని చెప్పడం కూడా తనకు చాలా ఆనందాన్ని కలిగించిందని ఆ విషయం మర్చిపోలేని జ్ఞాపకంగా మిగిలిందని తెలిపారు నాగచైతన్య. మొత్తానికి నాగచైతన్య చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. తండెల్ సక్సెస్ తర్వాత నాగచైతన్య తన తదుపరిచిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. నాగచైతన్య సినిమాలలోనే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ మంచి పేరు సంపాదించారు. దూత అనే వెబ్ సిరీస్ తో మరింత క్రేజ్ పెంచుకున్నారు నాగచైతన్య. ప్రస్తుతం శోభితతో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు నాగచైతన్య.

మరింత సమాచారం తెలుసుకోండి: