
అయితే తాజాగా నటి మాధురి దీక్షిత్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ ఎమ్మెల్యే టికారం జుల్లీ ఇటీవల అసెంబ్లీలో మాట్లాడుతూ మాధురి దీక్షిత్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మధ్య జైపూర్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల IIFA 2025 ప్రోగ్రామ్ జరిగింది. ఈ అవార్డ్ ఫంక్షన్ కి బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అందులో నటులు కరణ్ జోహార్, కరీనా కపూర్ ఖాన్, కత్రినా కైఫ్, రేఖ, కార్తీక్ ఆర్యన్ వచ్చారు. దాని గురించి రాజస్థాన్ ఎమ్మెల్యే టికారం జుల్లీ మాట్లాడుతూ.. జైపూర్ లో జరిగిన ఫిల్మ్ అవార్డ్ ఫంక్షన్ లో తక్కువ మంది బాలీవుడ్ తారలు ఉన్నారని విమర్శించారు. అసలు ఆ కార్యక్రమం వల్ల రాష్ట్రంపై ఏమైనా ప్రభావం చూపుతుందా అని ప్రశ్నించారు. వారికి దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపించారు.