
అయితే కుక్కే సుబ్రమణ్య స్వామి దేవాలయాన్ని దర్శిస్తే పెళ్లి కాని జంటలకు త్వరలోనే పెళ్లి జరుగుతుందని నమ్మకం .. అలాగే పెళ్లయిన వారు ఈ ఆలయాన్ని దర్శిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు . అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు కత్రినా కూడా ఈ ఆలయాన్ని దర్శించడం , ప్రత్యేక పూజలు చేయడం లాంటివి చూస్తే ఈ బ్యూటీ పిల్లల కోసం గుళ్ళు గోపురాలు తిరుగుతుందని అభిమానులు అంటున్నారు.
ఈ బ్యూటీ సినిమాల విషయాని కొస్తే కత్రీనా ప్రస్తుతం ఎలాంటి సినిమాలోను నటించడం లేదు .. చివరగా విజయ్ సేతుపతి సరసన మేరీ క్రిస్మస్ సినిమాలో నటించింది .. గత సంవత్సరం రిలీజ్ అయింది .. అయితే ఇప్పుడు హోలీ పండుగ సందర్భంగా కత్రినా 2007 సంవత్సరంలో వచ్చిన నమస్తే లండన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది . ఇందులో అక్షయ్ కుమార్ తో కలిసి నటించింది . అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.