గత కొన్ని రోజులుగా అటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, సినీ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య ఏదో ఒక మాటలు యుద్ధం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తమిళ్ నాడు సంస్కృతిని తిడుతున్నారని త్రిభాషా వాదన సరికాదు అని ఇండియాకి బహుభాషలే కావాలి అంటూ స్పష్టం మాట్లాడడం జరిగింది.. దక్షిణాది భారతదేశం పైన హిందీని రుద్దుతున్నారన్నట్లుగా మాట్లాడడం జరిగింది. అలాంటప్పుడు ఎందుకు తమిళ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేయవద్దు.. మీకు డబ్బులు ఏమో బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి కావాలా అంటూ ప్రశ్నించడం జరిగింది?. మరి హిందీ మాత్రం వద్దా అంటూ పవన్ కళ్యాణ్ పిఠాపురం సభలో ఇటీవలే ఇదెక్కడి న్యాయమంటూ ప్రశ్నించారు.


అయితే ఈ అంశం పైన సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. బహుభాష విధానం పైన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఇలా కౌంటర్ వేస్తూ.. హిందీ భాషను తమ పైన రుద్దకండి అంటూ చెప్పడంలో ఇంకొక భాషను సైతం ద్వేషించడం అన్నట్టు కాదని.. తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు.. స్వాభిమానంతోనే మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అంటూ పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ వెల్లడించారు ప్రకాష్ రాజ్.



గతంలో కూడా ప్రకాష్ రాజ్ ,పవన్ కళ్యాణ్ కు మధ్య ఇలాంటి వార్ జరిగింది. ఇప్పుడు మరొకసారి భాషా విధానంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిన్నటి రోజున జనసేన ఆవిర్భావ సభలో చేసిన వ్యాఖ్యలు ఏపీ అంతట వైరల్ గా మారుతున్నాయి..జనసేన కార్యకర్తలు నేతలు కూడా పిఠాపురం కి వచ్చి మరి ఈ సభను చాలా సక్సెస్ ఫుల్ గా చేశారు. మరి 2029 లో కూటమి గానే పోటీ చేస్తారా సింగల్ గా పోటీ చేస్తారా అన్న విషయం చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: