
ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. బాలయ్య తీసుకున్న ఒక డెసిషన్ ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ కే కాదు సినీ జనాలకి సైతం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . సాధారణంగా స్టార్ హీరోస్ ఎవరైనా సరే సింగిల్ గానే స్క్రీన్ పై కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు . సింగిల్ రేంజ్ లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు . అయితే బాలయ్య మాత్రం అఖండ సినిమా తర్వాత ఏ సినిమా చేసిన సరే అందులో ఒక హీరోని కచ్చితంగా పెట్టుకోవాలి అంటూ డిసైడ్ అయ్యారట .
మల్టీస్టారర్ మూవీ అని చెప్పలేం.. అలా అని బాలయ్య ఒక్కడే లీడ్ రోల్ పోషిస్తారు అని చెప్పలేం . ఆయనతో పాటు వేరే టైర్ టు హీరోస్ కూడా ఆయన సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట . తద్వారా బాలయ్య ఆ హీరోలకి కెరియర్ ఇచ్చినట్లు అవుతుంది . సినిమా ఇండస్ట్రీకి సక్సెస్ ఇచ్చినట్లు అవుతుంది. ఒక టైర్ 2 హీరో సింగిల్ గా నటించి హిట్ కొట్టాలి అంటే చాలా కష్టం . అదే ఒక బిగ్ స్టార్ తో కలిస్తే మాత్రం అది చాలా ఈజీ అయిపోతుంది. టైర్ 2 హీరోలు కెరియర్ లో సెటిల్ అవ్వాలి అన్న ఉద్దేశం కారణంగానే బాలయ్య ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట . దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. కేవలం బాలయ్య కాదు గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ఇండస్ట్రీ గురించి ఇదేవిధంగా ఆలోచించేవాళ్ళు . మనం బతకడం కాదు మన ద్వారా నలుగురు బ్రతకాలి ..అదే సినిమా ఇండస్ట్రీ అంటే అంటూ చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు . నందమూరి బ్లడ్ అంటే అదే అంటూ బాలయ్య తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించేస్తున్నారు..!