
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ఆ 20 నిమిషాలు వైల్డ్ ఫైర్ అటాక్ సీన్ ఉంటుందని తెలుస్తోంది. ఆ సీన్ కి థియేటర్స్ మొత్తం షేక్ అయిపోవాల్సిందే అంటూ టాక్ వినిపిస్తుంది. ఎస్ఎస్ఎంబి 29 సినిమా కోసం ఏళ్లుగా ఫాలో అవుతున్న సెంటిమెంట్ ని కూడా మహేష్ బాబు బ్రేక్ చేశాడని అందరికీ తెలిసిందే. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో తెరకెక్కనున్న SSMB29పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా సినిమా షూటింగ్ లో భాగం అయినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ప్రియాంక చోప్రా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. హోలీ పండుగ అయిన వర్కింగ్ చేయాల్సిందే అని.. ఇండియాలోనే ఉన్నాను అని రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ కి మహేష్ బాబు భార్య నమ్రత స్పందించింది. ప్రియాంక ఫోటోలకు హ్యాపీ హోలీ అంటూ కామెంట్ పెట్టింది. దీంతో ప్రియాంక SSMB29 సినిమా షూటింగ్ లోనే ఉందని అర్దం అవుతుంది. ప్రియాంక, మహేష్ బాబు, జకన్నతో ఒడిశాలో సెట్ లో ఉందని తెలుస్తోంది.