టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన సమంత ప్రస్తుతం సినిమాలలో కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ లపైనే దృష్టి పెట్టింది. ఫ్యామిలీ మ్యాన్ -2 సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న సమంత భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు కూడా రక్త్ బ్రహ్మాండనే వెబ్ సిరీస్ లోనే నటిస్తోంది. తన సొంత బ్యానర్లో మా ఇంటి బంగారం అనే చిత్రంలో కూడా నటిస్తోంది సమంత. అటు నిర్మాణరంగంలో ఇటు హీరోయిన్గా బాగానే క్రేజీ సంపాదించుకుంటోంది. ఇటీవలే సమంత నిర్మాణంలో శుభం సినిమా షూటింగ్ను కూడా పూర్తి చేసుకున్నది.


దీంతో టీమ్ తో కలిసి సరదాగా గడిపిన కొన్ని క్షణాలను కూడా సమంత తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఇందులో సమంత హాస్పిటల్ బెడ్ పైన సెలైన్ ఎక్కించుకుంటూ ఒక ఫోటోను కూడా షేర్ చేసింది.ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు కంగారు పడుతున్నారు అసలు సమంతకి ఏమైంది అంటూ కామెంట్స్ బాక్సులో తెగ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కానీ సమంత ఏమైందని విషయం పైన మాత్రం క్లారిటీ ఇవ్వలేదు గతంలో మయోసైటిస్తో ఇబ్బంది పడుతున్నట్లు తెలియజేసింది. అందుకు సంబంధించి అప్పుడప్పుడు ఇలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.


ట్రీట్మెంట్ కోసం విదేశాలలో వెళ్లి తీసుకుంది సమంత. ఇప్పటికీ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ తో ఈమె గత కొద్ది రోజులుగా డేటింగ్ చేస్తోందని వార్తలు బాలీవుడ్ లో తెగ వినిపిస్తున్నాయి.. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ కూడా ఎక్కడికి వెళ్లినా కలిసే వెళుతున్నాను అయితే ఈ విషయం పైన సమంత కాని అటు రాజ్ గాని ఎక్కడ స్పందించిన దాకాలు కనిపించడం లేదు. మరి రాబోయే రోజుల్లో ఏదైనా సమంత గుడ్ న్యూస్ తెలియజేస్తుందో చూడాలి మరి. మరి మొత్తానికి సమంత సెలైన్ బాటిల్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: