టాలీవుడ్ లో అల్లరి నరేష్ ఎన్నో కామెడీ చిత్రాలలో నటించి బాగానే పేరు సంపాదించారు. అయితే నెమ్మదిగా కామెడీ హీరో అనే ట్యాగ్ని తగ్గించి విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అభిమానులను అలరిస్తూ ఉన్నారు. అలా సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత చాలా డిఫరెంట్ కథలతో వస్తూ ఉన్న అల్లరి నరేష్ ఇటీవలే బచ్చల మల్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇలాంటి సమయంలోనే పొలిమేర, పొలిమేర-2 వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్న డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ పర్యవేక్షణలో డైరెక్టర్ నాని కరసగడ్డ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.


అల్లరి నరేష్ హీరోగా, కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం 12A  రైల్వే కాలనీ. ఈ చిత్రానికి ఇదే టైటిల్ని పెట్టారు. పొలిమేర సినిమాలో లాగే ఈ సినిమాలో కూడా క్షుద్ర పూజలు, ఆత్మలతో కొనసాగేలా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి నిన్నటి రోజున టైటిల్ గ్లింప్స్ సైతాన్ రిలీజ్ చేయగా బాగానే ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. టీజర్ విషయానికి వస్తే.. ఆత్మలు కొంతమందికే ఎందుకు కనబడతాయి మిగతా వారికి ఎందుకు కనపడవు అనే డైలాగుతో మొదలవుతుంది. టీజర్ చూస్తూ ఉంటే చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. హర్రర్ నేపథ్యంలోనే ఉండేలా ఉన్నది.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రేక్షకులను అభిమానులను ఆకట్టుకునేలానే కనిపిస్తున్నది.


చాలామందిని భయపెట్టేలా కూడా కనిపిస్తూ ఉన్నది. గతంలో అల్లరి నరేష్ కామెడీ హారర్ సినిమాలతో వచ్చిన కానీ ఈసారి మాత్రం  అల్లరి నరేష్ పెద్ద ప్లాన్ తోనే హిట్టు కొట్టేలా వస్తున్నారని అభిమానులు భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నదని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సమ్మర్ కి ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట చిత్ర బృందం. 12A రైల్వే కాలనీ సినిమాతో మంచి విజయాన్ని అందుకునేలా కనిపిస్తున్నారు అల్లరి నరేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: