భారతదేశంలోనే మొదటి సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన సినిమా “ఆదిత్య 369”.. నందమూరి నటసింహం బాలయ్య నటించిన సినిమాలలో ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది..అందుకే బాలకృష్ణ వందకు పైగా చిత్రాలు చేసిన ఈ సినిమా సీక్వెల్ తీసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు...అది కూడా బాలయ్యనే తన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలని ఆశ పడుతున్నారు..అలాంటి కల్ట్ క్లాసిక్ మూవీ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది..ప్రస్తుత తరం కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది... 1991లో విడుదలైన ఆదిత్య 369 సినిమాను అప్పటి సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు..

గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రమణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ నిర్మించిన ఈ సినిమా విజువల్ గ్రాండియర్  గా తెరకెక్కింది.దర్శకుడు సింగీతం ఈ సినిమాను ముందుగా కమల్ హాసన్ తో తీయాలని అనుకున్నారు కానీ అనుకోని కారణాలతో అది సాధ్యం కాలేదు. శ్రీ కృష్ణదేవరాయల పాత్రకు బాలకృష్ణ అయితే బాగా సూటవుతారనే ఉద్దేశంతో బాలయ్యని ఈ సినిమాలో తీసుకున్నారు.కమల్ ఈ సినిమా చేయలేకపోవడంతో బాలయ్యే ఈ సినిమాలో కృష్ణ కుమార్, శ్రీకృష్ణ దేవరాయలుగా నటించారు.. ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త భామ మోహిని హీరోయిన్ గా నటించగా , బాలీవుడ్ విలన్ అమ్రిష్ పూరిని విలన్ గా  నటించారు..1991 ఆగస్ట్ 18 విడుదలైన ఆదిత్య 369 చూసి ప్రేక్షకులు  అంతా ఆశ్చర్యపోయారు.

బాలయ్య లాంటి మాస్ హీరో ఇలాంటి బ్యాక్ డ్రాప్ సినిమాలో కనిపించడం ఫ్యాన్స్ కి సైతం ఎంతో కొత్తగా అనిపించింది.సినిమా అంతా ఒకెత్తు అయితే ఇళయరాజా సాంగ్స్ మరొక ఎత్తు అని చెప్పాలి.వినసొంపైన పాటలు, అబ్బురపరిచే ఆర్ట్ వర్క్, రాయల కాలం ఎపిసోడ్, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు  అన్ని సినిమాని ఊహించని రేంజ్ కి తీసుకెళ్లాయి..ప్రస్తుత జనరేషన్ కోసం ఈ సినిమాను మళ్ళీ 4K లో రిలీజ్ చేస్తున్నారు..ఈ కల్ట్ క్లాసిక్ మూవీని మేకర్స్ 2025 ఏప్రిల్ 11 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసారు.. ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది..ఈ అద్భుతమైన సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: