ఎవడే సుబ్రమణ్యం సినిమా చూడని వారుండారు. అప్పటినుండి ఇప్పటివరకు ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ.. ఈ సినిమాకు మాత్రం క్రేజ్ తగ్గలేదు.  ఆ టైమ్ లో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అంటే ఇదిరా అనిపించేలా ఉన్న సినిమా ఇది. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోలుగా న్యాచురల్ స్టార్ నాని, రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ లుగా మాళవిక, రీతూ వర్మ నటించారు. ఈ సినిమాకు అందాల రాక్షసి ఫేమ్ రాధన్ సంగీతం అందించాడు.

ఆ రోజుల్లోనే థియేటర్లలో ఈ సినిమా మంచిగా ఆడింది. ఈ మూవీ మంచి టాక్ ని కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని పాత్రలకు నాని, మాళవిక, విజయ్ దేవరకొండ ప్రాణం పొసరనే చెప్పాలి. వీరి నటన మాత్రం చాలా అద్బుతంగా ఉంటుంది. ఈ సినిమాలో నాని సుబ్రమణ్యం పాత్ర పోషించాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని తనని తాను అన్వేషించుకోవడానికి చేసిన ఓ ప్రయణమే ఈ సినిమా. ఈ సినిమాను ప్రియాంక దత్ నిర్మించారు.  


అయితే ఈ సూపర్ సినిమా వచ్చి పదేళ్ల అవుతుంది. ఈ సినిమా మరోసారి థియేటర్ లలో రిలీజ్ కానుంది. ఈ నెల 21న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో నాని, విజయ్ ఫ్యాన్స్ మధ్య వార్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ఇటీవలే నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. 'ఫ్యాన్స్ వార్ నాకు తెలీదు. కానీ ఈ సినిమా సమయంలో నాని, విజయ్ కి చాలా సప్పోర్ట్ చేశాడు. ప్రతి సన్నివేశాన్ని ఒకరికొకరు చర్చించుకుని నటించేవారు. ఇలాంటి సినిమా ఇప్పుడు చేయడం కష్టం. కొన్ని సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి. అలాంటి సినిమా ఇది.. ఈ సినిమాకు మళ్లీ అందరూ కనెక్ట్ అవుతారు' అని చెప్పుకొచ్చారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: