
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ టాలీవుడ్ లో ఏ హీరోకి లేదు. ప్రభాస్ అంటే చాలు ప్రాణాలు ఇచ్చే అంతా ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు. ప్రభాస్ ని టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. గ్లోబల్ స్టార్ ప్రభాస్ ఇండియా లోనే కాదు.. ఇతర దేశాలలో కూడా పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి ఏ సినిమా చేసినా పాన్ ఇండియా మొత్తం ఎదురుచూస్తుంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూస్ ఆయన గురించి అలా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ప్రభాస్ కి నో చెప్పడం తెలియదు అంట. ఆయన మంచితనమే చాలా మందికి నచ్చదు అంట. ఏదైనా కావాలని సరదాకి చెప్పిన తీసుకొస్తారని అంటారు.
ఇక అందాల భామ అనుష్క శెట్టి గురించి పరిచయం అనవసరం. జేజమ్మగా పేరు సంపాదించుకుని అంచలంచాలుగా ఎదుగుతూ వచ్చింది. అయితే ఈ బ్యూటీ ఫోన్ ఎప్పుడు సైలెంట్ లోనే ఉంటుంది అంట. ఫోన్ కాల్స్ కూడా ఎక్కువ అటెండ్ చేయదని బాహుబలి తర్వాత తమన్నా కూడా కంప్లైంట్ చేసింది. అలాగే బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు స్టోరీ నేరేషన్ చేయడం సరిగ్గా రాదని, స్టోరీ మాత్రం బాగుంటుంది కానీ చెప్పడం రాదని చాలా మంది సెలబ్రిటీలు అన్నారు.