సాయి పల్లవి ఈ మధ్యకాలంలో చాలా చాలా మంచి సినిమాలను చూస్ చేసుకుంటూ వస్తుంది. సాయి పల్లవి అమరణ్ సినిమాతో అదే విధంగా తండేల్ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను  తన ఖాతాలో వేసుకుంది . ప్రజెంట్ బాలీవుడ్ రామాయణ అదే విధంగా తమిల్ లో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ముందుకెళ్తుంది . కాగా ఇప్పుడు సాయి పల్లవి పేరు మరొకసారి ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. ఇదే మూమెంట్ లో హీరోయిన్ సాయి పల్లవి క్రేజీ ఆఫర్లు పట్టేస్తుంది.  ఈ మధ్యకాలంలో ఎక్కువగా బయోపిక్ లనే చూస్ చేసుకుంటూ వస్తుంది సాయి పల్లవి .


ఇప్పుడు కాంట్రవర్షియల్ హీరోయిన్ ప్రత్యూష బయోపిక్ లో నటించడానికి ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . నిజానికి ప్రత్యూష బయోపిక్ లో చాలామంది హీరోయిన్స్ నటించడానికి భయపడ్డారు.  మరి ముఖ్యంగా లావణ్య త్రిపాఠి అదే విధంగా రష్మిక మందన్నా లాంటి స్టార్ హీరోయిన్స్  పేర్లు కూడా ఈ లిస్టులో వినిపించాయి.  కానీ రష్మిక మందన్నా - లావణ్య త్రిపాఠి ఇది పొలిటికల్ నేపథ్యంగా కూడా ఉండడంతో ఇలాంటి పాత్రలో నటించడానికి భయపడ్డారు. మనకు తెలిసిందే ప్రత్యూష మరణం ఓ మిస్టరీ గానే ఉంది. ఇందులో పొలిటీషియన్స్ పిల్లల్లు కూడా ఇన్వాల్వ్ అయ్యారు.



ఫైనల్లీ సాయి పల్లవి మాత్రం ఏ భయం బెరుగు లేకుండా .. ఇలాంటి పాత్రలో నటించడానికి ఓకే చేసిందట.  ప్రజెంట్ సినిమా ఇండస్ట్రిలో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా టృఎండ్ అవుతూ వైరల్ గా మారింది . త్వరలోనే హీరోయిన్ ప్రత్యూష బయోపిక్ లో సాయి పల్లవి నటించబోతుంది  అనే విషయం అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారట . దీంతో ఇప్పుడు మళ్లీ తెరపైకి ప్రత్యూష లైఫ్ హిస్టరీ కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి. నిజంగా ఇది నిజం అయితే మాత్రం సాయి పల్లి కెరీర్ కి ఇక తిరుగుండదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: