
హీరోయిన్ లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . వీళ్ళ ప్రేమాయణం అస్సలు బయటకు రాకుండా చాలా చాలా జాగ్రత్త పడ్డారు . నిశ్చితార్థం చేసుకుని తమ ప్రేమ విషయాన్ని పెళ్లి విషయాన్ని అఫీషియల్ గా బయటపెట్టారు . కాగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మరొకసారి హీరోయిన్ లావణ్య త్రిపాఠి హీరో వరుణ్ తేజ్ ల పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి . దానికి కారణం వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమాలో కనిపించబోతున్నారట .
గతంలో నాగచైతన్య - సమంత కూడా ఇదేవిధంగా పెళ్లి తర్వాత "మజిలీ" అనే సినిమాలో నటించి మెప్పించారు . ఇప్పుడు వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి కూడా అలాగే చేయబోతున్నారట . నిజానికి వీళ్ళ పెళ్లైన మూమెంట్లోనే వీళ్ళ కాంబోలో సినిమా రాబోతుంది అని అంతా మాట్లాడుకున్నారు . ఇన్నాళ్ళకి ఆ గుడ్ న్యూస్ వినిపిస్తున్నారా..? అంటూ మెగా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఎక్సైట్ మెంట్ తో ధ్రిల్ అయిపోతున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ శివ నిర్వాణ .. వీళ్ళిద్దరిని పెట్టి హీరో హీరోయిన్లుగా మూవీని తెరకెక్కించబోతున్నారట . ఆశ్చర్యం ఏంటంటే గతంలో నాగచైతన్య - సమంతలను కూడా ఈయనే హీరో హీరోయిన్లుగా పెట్టి సినిమాను తెరకెక్కించారు..!