చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కోంద‌రు హీరోయిన్లకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు ఇచ్చిన .. వారికి భారీ క్రేజ్ వచ్చిన ఎందుకో తెలియదు కానీ వారీ మనసు మాత్రం బాలీవుడ్ పైనే ఉంటుంది .. తాజా గా మరో బ్యూటీ కూడా అదే పని చేస్తున్నారు .  తెలుగులో వ‌రుస‌ అవకాశాలు వస్తున్న కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తామన్న .. ఆమె మనసు మాత్రం బాలీవుడ్ పైనే ఉంది అంటున్నారు .. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారా .. గత పదేళ్ళ నుంచి బాలీవుడ్ లో ఉన్న రాని పేరు తెలుగు లో రెండు అంటే రెండు సినిమాలు తోనే తెచ్చుకుంది సీతారామం బ్యూటీ మృణాళ్ ఠాకూర్ .. నార్త్ లో అరుడజన్‌ సినిమాలు దానికి ముందు సీరియల్స్ చేసిన కనీసం ఎవరు పట్టించుకోలేదు ఈ బ్యూటీని . అలాంటి సమయంలో సీతారామం అనే ఒకే ఒక సినిమా ఈమె జాతకాన్ని ఊహించిన విధంగా మార్చేసింది ..


ఇక తర్వాత హాయ్ నాన్న తో తెలుగులో సెటిలయ్యే భారీ ఛాన్స్ కూడా వచ్చింది .. తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమా తో నిరాశ పరిచిన మృణాల్ ఠాకూర్ కు టాలీవుడ్ లో మంచి ఆఫర్లే వస్తున్నాయి . కానీ ఈ బ్యూటీ మాత్రం సౌత్ ను ఆస‌లు పట్టించుకోవడం లేదు .. ఏదో అనుకోకుండా రెండు సినిమాలు చేశారేమో అనిపిస్తుంది .. పద్ధతి కూడా అలానే ఉంది .. బాలీవుడ్ పై ఉన్న ప్రేమతో ఈ మధ్య ఫోటోషూట్స్లో మరింత గ్లామర్ డోస్ పెంచేశారు మృణాల్. బాలీవుడ్లో సంజయ్ లీల బన్సాలి ప్రొడక్షన్లో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో పాటు సన్ ఆఫ్ సర్దార్ 2 లో కూడా మృణాల్‌ నటిస్తుంది .. మరో రెండు సినిమాలు చర్చలు దశలో ఉన్నాయి. అయితే తెలుగులో ప్రస్తుతం  అడివి శేష్‌తో డెకాయిట్‌లో మాత్రమే నటిస్తున్నారు ఈ హీరోయిన్ .. ఇలా మొత్తానికి సౌత్ లో ఎన్ని అవకాశాలు ఇచ్చినా .. ఇస్తామని చెప్పినా మృణాల్‌ మనసు మాత్రం ముంబైలోనే ఉంది.\

మరింత సమాచారం తెలుసుకోండి: