దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న గ్లోబల్ మూవీ గురించి అందరికి తెలిసింది .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎంతో సరవేగంగా జరుగుతుంది .. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్ బాబు తో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా , స్టార్ మేటర్ పృథ్విరాజ్ సుకుమారాన్ని వంటి వారు కీలకపాత్రలో నటిస్తున్నారు .. త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావటంతో సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. ఈ సినిమా షూటింగ్ మన దేశంలోనే జరుగుతుంది ..


అయితే పూర్తిగా అటవీ నేపథ్యంలో సాగే ఈ మూవీ కోసం మహేష్ బాబు ఎంతో కష్టపడుతున్నాడు . దీంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . అంతే కాకుండా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఫుల్ ఈగర్‌గా ఎదురు చేస్తున్నారు . దీంతో ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు కూడా వెయిట్ చేస్తున్నారు . ఈ క్రమంలో.. తాజాగా, సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.


అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పై ఇంట్రెస్టింగ్ టాక్ బయటకు వచ్చింది .. రాజమౌళి ఈ సినిమాని మొదలు పెట్టడం ఆలస్యం అయినప్పటికీ షూటింగ్ మాత్రం జట్ స్పీడ్ లో జరిపిస్తున్నాడట .. అంతే కాకుండా అనుకున్న సమయం కంటే షూటింగ్ ను ముందే కంప్లీట్ చేయబోతున్నాడట .. దీనికి తోడు రెండు భాగాల షూటింగ్ కూడా ఇదే స్పీడ్ లో జరుగుతుందని తెలుస్తుంది .. అయితే ప్రస్తుతం ఈ సినిమాని మేకర్స్ 2027 కి మొదటి భాగ‌న్నీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే ..  ఈ సినిమాతో రాజమౌళి , మహేష్ తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతున్నారో చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: