టాలీవుడ్ హీరో మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. విలక్షణ నటుడు మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీ కి అడుగు పెట్టిన విష్ణు ఒకటి రెండు సినిమాలు తప్పించి తన తండ్రి స్థాయిలో ఆకట్టుకోలేక పోయారు..గత కొంత కాలంగా విష్ణు నటించిన ఏ సినిమా ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేదు.. దీనితో ఈ సారి ఎలాగైనా సాలిడ్ హిట్ అందుకోవాలని విష్ణు చూస్తున్నాడు.. ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు.. ప్రెస్టేజియస్ మూవీగా తెర కెక్కుతున్న ‘కన్నప్ప’ మూవీలో విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'కన్నప్ప' మూవీ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది..

కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు... భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.. మహా భారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. అయితే మంచు విష్ణుకి పాన్ ఇండియా రేంజ్ లో మార్కెట్ లేకపోవడంతో ఈ సినిమాకు ప్లస్ అయ్యే విధంగా పాన్ ఇండియా లెవల్ లో భారీ స్థాయిలో ప్రమోట్ చేసేందుకు ఇండియా వైడ్ పాపులర్ అయిన బిగ్ స్టార్స్ ని ఈ సినిమాలో కీలక పాత్ర చేసేలా ఒప్పించారు..ఈ సినిమాలో మోహన్ బాబు శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి స్టార్స్ కీలక పాత్ర పోషించారు..

 అలాగే ఈ సినిమాకు మెయిన్ అసెర్ట్ అయిన ప్రభాస్ “ రుద్ర” అనే పాత్రలో నటించాడు..ప్రభాస్ నటించిన రుద్ర అనే పాత్ర సినిమాకు ప్లస్ అవుతుందని మూవీ టీం చాలా నమ్మకంగా వుంది..రుద్ర పాత్ర దాదాపు 25-30 నిమిషాలు ఉంటుందని సమాచారం.. కన్నప్ప సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25 న మేకర్స్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలలో బిజీగా వుంది.. ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ కి మంచి స్పందన వచ్చింది.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రఘుబాబు షాకింగ్ కామెంట్స్ చేసారు..కన్నప్ప సినిమాను ఎవరైనా ట్రోల్ చేస్తే శివుడి ఆగ్రహానికి గురవుతారని.. శివయ్య శాపానికి గురవుతారని అన్నారు.. అయితే దీనికి నెటిజన్స్ స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు.. సినిమాను ట్రోల్ చేసిన వారు శాపానికి గురైతే సినిమా సరిగ్గా తీయని వారు నరకానికి వెళ్తారా అని కౌంటర్ ఇస్తున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: