టాలీవుడ్ లో పలు చిత్రాలలో నటుడుగా నటించిన అజయ్ ఘోష్ ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక విభిన్నమైన పేరును సంపాదించారు. అయితే ఎప్పుడు కూడా సినిమాల గురించి మాట్లాడే ఈ నటుడు మొదటిసారి రాజకీయాల గురించి మాట్లాడడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీల గురించి మాట్లాడడం జరిగింది అజయ్ ఘోష్. ఈయన మాట్లాడిన మాటలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పుష్ప సినిమా తర్వాత యాక్టర్ గా బిజీ అయిపోయిన అజయ్ ఘోష్ పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటిస్తూ ఉన్నారు.


కొన్ని చిత్రాలలో విలన్ గా కూడా నటించిన ఈ నటుడు.. ఇటీవలే హైదరాబాదులో నిర్వహించినటువంటి భగత్ సింగ్ యువజన ఉత్సవాల ముగింపు వేడుకలలో భాగంగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ.. ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీల అవసరం చాలానే ఉన్నదని ఇప్పటికే చాలామంది చాలా దేశాలలో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి వచ్చాయని కానీ మన దేశంలో మాత్రం ఎక్కడా రావడం లేదంటే తెలియజేశారు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి కానీ ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని కూడా తెలియజేశారు అజయ్ ఘోష్.


కమ్యూనిస్టు పార్టీల నేతలు ఒక మెట్టు దిగి మరి ప్రజల కోసం ఏకం కావాలి అంటూ ఈ దేశాన్ని కాపాడాల్సింది కమ్యూనిస్టు పార్టీలే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. కానీ నటుడు అజయ్ ఘోష్ ఇతర పార్టీల గురించి మాట్లాడకుండా కేవలం కమ్యూనిస్టు పార్టీల గురించి మాట్లాడడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నది. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రాజకీయాలలో మాత్రం అటు ఏపీలో వైసిపి జనసేన టిడిపి బిజెపిని కనిపిస్తూ ఉన్నాయి.. తెలంగాణలో అయితే కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: