మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు అందరిలో ఉన్న సందేహం ఒకటే .. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఎంతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముందుగా ఓకే చేసిన సినిమాలు కాకుండా కొత్త సినిమాలు చేస్తాడా లేదా .. హరిహర వీరమల్లు , ఓజీలు ఇంకొంచెం పెండింగ్ ఉన్నాయి .. ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందో లేదు అని అనుమానాలు కూడా మొదలయ్యాయి .. సురేందర్ రెడ్డి కి గతంలో ఓకే చేసిన సినిమాను క్యాన్సిల్ చేశారని టాక్ బయటకు వచ్చింది .. అయితే ఈ క్రమంలో పవన్ స్వయంగా చెబితే తప్ప ఇందులో క్లారిటీ రాని పరిస్థితుల్లో ఎట్టకేలకు దీనికి సమాధానం దొరికేసింది .. తాజాగా ఓ తమిళ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తన మనసులో మాటను బయటికి చెప్పేసాడు .


డబ్బు అవసరం ఉన్నంతకాలం సినిమాలు ఆపనని .. కాకపోతే పాలన వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి రాజీ పడకుండానే రెండు బ్యాలెన్స్ చేసేలా ప్లాన్ చేస్తానని ఆయన వివరించాడు .. జనసేన నిర్వాహన , ప్రచారం , సహాయాలు , విరాళాలు , దత్తతలు ఇలా ఎన్నో కార్యక్రమాల కోసం పవన్ కు ఆర్థిక మద్దతు ఎప్పటికప్పుడు కావాల్సి ఉంటుంది ..  అయితే ఇది వినటానికి బాగానే ఉంటుంది కానీ పవన్ అంతా తేలిగ్గా కొత్త కమిట్మెంట్లు ఇచ్చేలా ఇక్కడా కనిపించడం లేదు .. మార్చ్ 29న రావాల్సిన వీరమల్లు వాయిదా పడింది డిప్యూటీ  సీఎంగా బిజీ షెడ్యూల్ కారణంగానే మరి కొత్తవి ఓకే చేస్తే వాటికి న్యాయం చేయగలిగే దమ్ము ఉండాలి కదా .


అయితే ఇక్కడ సానుకూల అంశాన్ని ఒకటి గమనించుకోవచ్చు .. కూటమి మొదటి సంవత్సరం కాబట్టి పవన్ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు . ఒక్కసారి సిస్టం సెట్ అయ్యాక క్రమంగా సినిమాలు కూడా చేసేయవచ్చు .. తక్కువ డేట్లతో వేగంగా పూతే ఎలా భీమ్లా నాయక్ , వకీల్ సాబ్ , బ్రో లాంటివి ఓకే చేస్తే అందరికీ మంచిది .. అలాకాకుండా హరిహర వీరమల్లు , ఓజి లాంటి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో గ్రాండ్ అపీరియన్స్ ఉంటేనే పెద్ద చిక్కులు వచ్చి పడతాయి .. ఎలాగూ త్రివిక్రమ్ సలహాలు సూచనలు ఉంటాయి కాబట్టి రెండు పడవల ప్రయాణం పవన్ కు అంత కష్టమేమీ కాదు ..  ఎంతోకాలం తర్వాత మే 9న పవన్ కళ్యాణ్ థియేటర్లో దర్శనం కోసం అభిమానులు వేయకలతో ఎదురుచూస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: