టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన పూజా హెగ్డే.. ఈ మధ్యకాలంలో తెలుగులో నటించిన ఏ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి.. ఇక వచ్చిన అవకాశాన్నల్లా చేజారించుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్లో తన హవా చూపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. హై జవానీతో ఇష్క్ హునా హై  వంటి చిత్రంలో నటిస్తూ ఉన్నది. ఇందులో వరుణ్ దావత్ హీరోగా నటిస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి కామెడీ షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఈ చిత్రానికి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించారు.


హై జవానీతో ఇష్క్ హునా హై చిత్ర బృందం మొత్తం కూడా రిషికేష్ కి వెళ్లడం జరిగింది.. ఈ క్రమంలోనే అక్కడ ఒక ఆశ్రమాన్ని కూడా సందర్శించి అక్కడ దిగినటువంటి పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది.ముఖ్యంగా రుద్రాక్ష మొక్క ను కూడా అక్కడ నాటారట. ఇకపోతే పూజా హెగ్డే ,వరుణ్ ధావన్ సోషల్ మీడియా వేదికగా తమ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్టుని షేర్ చేయడం జరిగింది. అందులో వరుణ్ ధావన్, పూజా హెగ్డే ఇద్దరు కూడా బీచ్ లో దూకుతున్న ఫోటోలను సైతం షేర్ చేశారు.

ఈ పోస్టులకు సైతం రిషికేష్ లో తదుపరి షెడ్యూల్ తో మళ్ళీ కలుద్దాం అనే క్యాప్షన్ కూడా షేర్ చేయడం జరిగింది  ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. అయితే ఈ వీడియోలో వారు ధావన్ , పూజా హెగ్డే పరిగెత్తుకుంటూ వెళ్లి మరి బీచ్ లో దూకగా.. పూజా హెగ్డే నెమ్మదిగా పరిగెడుతూ ఉండగా వరుణ్ ధావన్ స్పీడుగా పూజ హెగ్డేను లాక్కొని వెళ్లినట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి బాలీవుడ్ హీరో తో పూజా హెగ్డే బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ వీడియో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: