
ఈ సినిమా నాగార్జునకు ఇటు ధనుష్ కు మంచి హిట్ అందజేస్తుంది అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . అయితే ఈ సినిమా అయిపోయిన వెంటనే శేఖర్ కమ్ముల ఏ హీరో తో సినిమాను ఓకే చేశాడు..? ఏ హీరో తో సినిమాలు తెరకెక్కించబోతున్నాడు అనేది బిగ్ హాట్ టాపిక్ గా మారింది . కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం హీరో నానితో శేఖర్ కమ్ముల ఒక సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవిని చూస్ చేసుకున్నారట.
శేఖర్ కమ్ముల - సాయి పల్లవి కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాలా. వీళ్ల కాంబోలో వచ్చిన ఫిదా.. ఆ తర్వాత వచ్చిన లవ్ స్టోరీ రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్సే . కాగా పర్ఫెక్ట్ హీరోకి పర్ఫెక్ట్ డైరెక్టర్ దొరికితే ఆ కాంబో రచ్చ రంబోలానే. అలాంటి కాంబోనే ఈ శేఖర్ కమ్ముల - నానిది అంటూ జనాలు ఓ రేంజ్ లో ఈ సినిమా గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ త్వరలోనే రాబోతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది . అంతేకాదు ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఇండస్ట్రీలో మరో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు శేఖర్ కమ్ముల..!