సినిమా ఇండస్ట్రీలో ఒకరు రిజెక్ట్ చేసిన కథలో మరొకరు హీరోగా నటించడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కెరియర్ లో కొనసాగిస్తున్న అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్ ఒక కథను రిజెక్ట్ చేయగా అదే కథలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించో ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇంతకు అల్లు అర్జున్ , జూనియర్ ఎన్టీఆర్ వదిలేసిన సినిమా ఏది ..? ఏ సినిమాతో రవితేజ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు అనే విషయాన్ని తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం మాస్ మహారాజా రవితేజ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో భద్ర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మొదటగా బోయపాటి శ్రీను , రవితేజను కాకుండా అల్లు అర్జున్ ను హీరోగా అనుకున్నాడట. అందులో భాగంగా ఆయనను కలిసి కథను కూడా వివరించాడట. కథ మొత్తం విన్న అల్లు అర్జున్ కథ సూపర్ గా ఉంది. కానీ నేను ప్రస్తుతం ఆర్య సినిమాకు కమిట్ అయి ఉన్నాను. అది పూర్తి అయ్యి మీ సినిమా చేయాలి అంటే చాలా లేట్ అవుతుంది. మీరు వేరే హీరోతో ముందుకు వెళ్ళండి అని చెప్పాడట. దానితో బోయపాటి శ్రీను , తారక్ ను కలిసాడట. కలిసి కథను వివరించాడట. కథ మొత్తం విన్న తారక్ కి ఆ కథ పెద్దగా నచ్చలేదట. దానితో తారక్ ఆ స్టోరీని రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత బోయపాటి శ్రీను , రవితేజకు ఈ మూవీ కథను వినిపించగా , ఆయన మాత్రం ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అలా బన్నీ , తారక్ రిజక్ట్ చేసిన కథలో రవితేజ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: