యాంకర్ గాయత్రి భార్గవి గురించి పరిచయం అనవసరం. ఈమె యాంకర్ మాత్రమే కాదు.. నటి కూడా. గాయత్రి భార్గవి సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఈమె మొదట యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత భార్గవి 2008లో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈమె సినిమాలలో సహాయక పాత్రలలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. భార్గవి హైదరాబాద్ లోనే జన్మించింది. తాను బాల్యం నుండి నేటివరకు హైదరాబాద్ లోనే ఉంటుంది. భార్గవి 2004లో విక్రమ్ సుబ్రమణ్యంని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈమెకి ఇద్దరు కుమారులు ఉన్నారు.
 
ఇక యాంకర్, నటి గాయత్రి భార్గవి చాలానే సినిమాలలో నటించింది. ఈమె నటించిన చాలా సినిమాలు కూడా మంచి హిట్ టాక్ ని అందుకున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో నటించింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ లో, దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ లో నటించింది. అలాగే ఈమె బలాదూర్, గాలిపటం, ఒక లైలా కోసం, తీన్మార్ లాంటి చాలా సినిమాలలో ఈమె సహాయక పాత్రలు పోషించింది. ఈమె చాలా మంది హీరోల సినిమాలలో నటించి మెప్పించింది.

 
ఇటీవలే గాయత్రి భార్గవి థంబ్ నెయిల్స్ ఇష్యూ గురించి ఫైర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ థంబ్ నెయిల్ పై ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఈ థంబ్ నెయిల్ ఇష్యూ గురించి యాంకర్ స్వప్న క్లారిటీ ఇచ్చింది. యాంకర్ స్వప్ననే అప్పట్లో ఆ ఇంటర్వ్యూ తీసుకుంది. ఆమె సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. 'ఆ ఇంటర్వ్యూ చేసింది నేనే. గతంలో ఆ ఇంటర్వ్యూకి మంచి రిచ్ వచ్చింది. అప్పుడు తాను కూడా నాకు కాల్ చేసి చెప్పింది. కానీ థంబ్ నెయిల్ ఇష్యూ ఏం లేదు. ఆ ఇంటర్వ్యూని చాలా మంది ఛానెల్స్ లో పోస్ట్ చేసుకున్నారు. వాళ్లలో ఎవరో ఫాల్స్ థంబ్ నెయిల్స్ పెట్టారు. నేను దాన్ని తీసేయించడం జరిగింది. కానీ మళ్లీ రీ పోస్ట్ చేశారు. కానీ ఇప్పుడు నేను ఐడ్రీమ్స్ లో పనిచేయడం లేదు. అది ఆర్గనైజేషన్ బాధ్యత' అని ఆమె క్లారిటీ ఇచ్చింది.      
 

మరింత సమాచారం తెలుసుకోండి: