
చరిత్రలో చాలామందికి తెలియని ఓ గొప్ప మహారాజ్ శంబాజీ గురించి ఈ సినిమాలో ఎంతో చక్కగా చూపించారు. ఇందులో విక్కీ కౌశల్ హీరోగా చేయగా.... రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో రష్మిక మందన వరుసగా సినిమాలు చేసుకుంటూ ఆగ్ర హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీ హీరోయిన్ గా తన లైఫ్ కొనసాగిస్తోంది.
ఇక ఈ సినిమాలో అక్షయ్ కన్నా కీలకపాత్రను పోషించారు. చావా సినిమాకు లక్ష్మణ్ ఉడేకర్ దర్శకత్వం వహించగా.... మడాక్ ఫిలిమ్స్ కు చెందిన దినేష్ విజన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా శివాజీ సావంత్ మరాఠీ నవల చావా ఆధారంగా రూపొందించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
చావా సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను త్వరలోనే పార్లమెంట్ లో ప్రదర్శిస్తారని వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, ఎంపీలు, కేంద్ర మంత్రులు హాజరవుతారని సమాచారం అందుతోంది. అంతే కాకుండా నటుడు విక్కీ కౌశల్ క్యాస్ట్ అండ్ క్రూ వస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా స్క్రీనింగ్ డేట్ పై స్పష్టత రావాల్సి ఉంది.