చాలామంది సినీ తారులకు వారికున్న సమస్యలను సైతం బయట చెప్పుకోవడానికి కొన్ని సందర్భాలలో భయపడినప్పటికీ.. ఆ తర్వాత నెమ్మదిగా తెలియజేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా వీరికి అనారోగ్య సమస్యలు ఉన్న విషయాన్ని కూడా బయట పెట్టడానికి కొన్ని సందర్భాలలో ఇష్టపడరు. ఎందుకంటే దీని వల్ల తమ సినీ కెరియర్ దెబ్బ పడుతుందనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు మరి కొంతమంది తారలు ధైర్యంగా తమకున్న ఇబ్బందులను సమస్యలను తెలియజేస్తూ ఉంటారు. వీటివల్ల ఆవనారోగ్య సమస్యల పైన ప్రజలకు అభిమానులకు అవగాహన కల్పిస్తూ ఉంటారు.


అలా ఇప్పుడు తాజాగా సీనియర్ నటిగా పేరు పొందిన సుహాసిని కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది. 1990లో స్టార్ హీరోయిన్గా ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలు నటించిన ఈమె ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాలను నటిస్తూ ఉన్నది. తెలుగులోనే కాకుండా దక్షణాది భాషలలో కూడా నటించిన హీరోయిన్ సుహాసిని ఇటీవలే ఒక ఇంటర్వ్యూకు హాజరై పర్సనల్ ప్రొఫెషనల్ విషయాలను కూడా తెలియజేసింది. ఈ సమయంలోనే తనకున్న అనారోగ్య సమస్యలను బయట పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.


హీరోయిన్ సుహాసిని కి టీబీ సమస్య ఉన్నదని తెలియజేసింది. అయితే ఈ విషయాన్ని భయంతో తాను అందరి దగ్గర దాచాను అని పరువుపోతుందని భయపడిపోయానని కానీ ఎవరికి తెలియకుండా తాను ఆరు నెలల పాటు చికిత్స తీసుకున్నానని ఆ తర్వాత ఈ విషయాన్ని సమాజానికి తెలిసేలా అందరిలా అవగాహన కల్పించేలా టీబీ గురించి చెప్పుకొచ్చానంటూ తెలియజేసింది సుహాసిని. తనకు ఆరు సంవత్సరాల వయసులోని టీవీ సమస్య బయటపడిందని ఆ తర్వాత కొద్ది రోజులకు అంత ఓకే అనుకున్నాను మళ్ళీ 36 ఏళ్ల వయసులో తనకు ఇది తిరగబడిందని తెలియజేసింది. దీనివల్ల తాను బరువు తగ్గిపోయానని వినికిడి సమస్య  కూడా అప్పుడే తనకు మొదలయ్యిందని తెలియజేసింది. ఆ తర్వాత నెమ్మదిగా ఈ సమస్య తగ్గుముఖం పట్టిందని వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: