టాలీవుడ్ హీరో రామ్ చరణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఆర్ఆర్‌ఆర్‌ సినిమాలో నటించి.. గ్లోబల్ స్టార్ గా ఫేమ్ సంపాదించుకున్నాడు. హీరో రామ్ చరణ్ ఇటీవలే గేమ్ ఛేంజర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటించింది. అలాగే తెలుగు అమ్మాయి అంజలి కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇక స్క్రీన్‌పై లేనప్పటికీ అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చాటుకునే అతికొద్ది మంది హీరోల్లో చరణ్‌ ఒకరు.

సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా అంతగా హిట్ కాలేదు. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా ఆడుతుంది. ఈ మూవీ మార్చి 7న జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో హిందీ వెర్షన్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీ 250 మిలియన్ మినిట్స్ కు పైగా వ్యూస్ సాధించినట్లు ఓ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. ఇక ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది.

 
ఈ మధ్య థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఓటీటీలు వచ్చినప్పటినుండి చాలా మంది థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడడం మానేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: