టాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన మెహర్ రమేష్ భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరు.. అయితే తాజాగా ఈయన ఇంట విషాదఛాయలు నెలకొన్నట్లు తెలుస్తోంది. మెహర్ రమేష్  సోదరి మదాసు సత్యవతి గడచిన కొన్ని గంటల క్రితం మరణించినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఈమె అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ హైదరాబాదులోని ఒక ఆసుపత్రులకు చికిత్స పొందుతూ ఈ రోజున పరిస్థితి విషమించి సత్యవతి మరణించినట్లుగా  తెలుస్తోంది.  ఈ విషయం విన్న మెహర్ రమేష్ అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. సత్యవతి ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థిస్తున్నారు.



సత్యవతి మరణ వార్త విన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతూ సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులు అర్పించారు. ముఖ్యంగా చిన్నతనంలో మెహర్ కుటుంబం విజయవాడలో ఉండేవారని.. చదువుకునే రోజులలో వేసవి సెలవులు వచ్చినప్పుడు వారి ఇంటికి వెళ్లి మరి ఆడుకునే వారమంటూ తెలియజేశారు. ఇప్పటికీ మెహర్ రమేష్, సత్యవతి కుటుంబంతో కలిసి గడిపిన ఆనంద జ్ఞాపకాలు కూడా అలాగే గుర్తున్నాయని తెలియజేశారు. ఇక మెహర్ రమేష్ తండ్రి కూడా నగరంలో  ఎస్సైగా పనిచేశారు.


ఇక మెహర్ రమేష్ తన ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని దర్శకుడుగా కావడానికి మొదట బాబి చిత్రంలో ఒక సహాయక పాత్రలో నటించడం జరిగింది. ఆ తర్వాత వీర కన్నడిగ అనే చిత్రంతో మొదటి సారి 2004లో డైరెక్టర్ గా పరిచయమయ్యారు.. ఈ చిత్రాన్ని తెలుగులో ఆంధ్ర వాళ్ళ పేరుతో రిలీజ్ చేశారు. అయితే తెలుగులో సక్సెస్ కాలేదు. ఇక మరొక చిత్రం అజయ్.. ఈ చిత్రాన్ని తెలుగులో మహేష్ బాబు ఒక్కడుగా రీమిక్స్ చేయగా భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ తెలుగులో మాత్రం మెహర్ రమేష్ సక్సెస్ కాలేకపోయారు. ఆ తర్వాత కంత్రి, బిల్లా, శక్తి, షాడో ,భోళా శంకర్ వంటి చిత్రాలు తీసిన ఫెయిల్యూర్ గానే మిగిలిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: