అందాల భామ ఫరియా అబ్దుల్లా గురించి పరిచయం అనవసరం. ఈమె తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫరియా అబ్దుల్లా జాతి రత్నాలు సినిమాలో నటించింది. ఈ సినిమాతోనే ఈమె సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించారు. జాతిరత్నాలు మూవీలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, చిట్టి పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. ఇందులో ఈమె లాయర్ షామిలీగా మంచి ఫన్ ని క్రియేట్ చేస్తుంది. ఈ మూవీతో సూపర్ హిట్ ని అందుకుంది.
 
ఆ తర్వాత ఫరియా అబ్దుల్లాకు, రవితేజ హీరోగా నటించిన రావణసుర సినిమాలో నటించింది. కానీ ఈ సినిమాతో అంతాగా విజయం అందుకోలేకపోయింది. తరువాత అల్లరి నరేష్ కి జంటగా ఆ ఒక్కటి అడగొద్దు అనే సినిమాలో నటించింది. ఈమె లైక్, షేర్ & సబ్‌స్క్రైబ్, మత్తు వదలరా, కల్కి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలలో నటించింది. ఈమె నటించిన అన్ని సినిమాలలో మంచి పాత్రలను పోషించింది. ఈమె అందం, అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. 

 
అయితే ఈ ముద్దుగుమ్మకి మంచి ఆఫర్ వచ్చింది. ఇటీవలే స్టార్ హీరో విజయ్ వారసుడు జసన్ సంజయ్ మెగాఫోన్ పట్టారు. జసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి హీరోగా విష్ణు విశాల్ నటిస్తున్నాడు. ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ సంస్త నిర్మిస్తుంది. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కానీ ఇంతవరకు ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అనేది స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా.. ఈ మూవీలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ అమ్మడు రేంజ్ మారిపోతుందని నెటిజన్స్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: