ఇది నిజంగా నందమూరి అభిమానులకు బిగ్ షాకింగ్ సర్ ప్రైజ్ అనె విషయం అని చెప్పాలి. . ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ అందరూ ఒకరి తర్వాత ఒకరు షాక్ లు ఇస్తున్నారు. . అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే అభిమానులకి స్వీట్ సర్ప్రైజ్ షాక్ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి ..  జూనియర్ ఎన్టీఆర్ అంటే పాన్ ఇండియా హీరో .. ఒక బిగ్ బడా హీరో ..ఎలాంటి రోల్స్ నైనా సరే అవలీలగా చేసేస్తాడు . ఇంతవరకే మాట్లాడుకుంటూ ఉంటారు జనాలు.


కొంతమంది ముందుకెళ్లి జూనియర్ ఎన్టీఆర్ లో దాగున్న హోస్ట్ ని కూడా బయటకు తీసుకొచ్చారు . ఆయన మీలో ఎవరు కోటీశ్వరుడు ..బిగ్ బాస్ సీజన్ లని హోస్ట్ చేశారు . అయితే చాలా టైం గ్యాప్ తర్వాత మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా మారిపోతున్నారట ..  అయితే ఈసారి మాత్రం ఓ రియాలిటీ గేమ్ షో కి కాకుండా ఓ టాక్ షో కి  హోస్ట్ గా మారిపోతున్నారట . . ప్రముఖ ఓటీటీ సంస్థతో చేతులు కలిపిన  జూనియర్ ఎన్టీఆర్ ఓ టాక్ షో కి హోస్టుగా మారిపోతున్నారట  . ..



అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆయన తెలుగులో టాక్ షో కి హోస్టుగా మారడం లేదు . బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ షోకి హోస్టుగా మారిపోతున్నారట . . ఇదంతా వార్ 2 సినిమా ప్రమోషన్స్ కోసమే చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు జనాలు . మొత్తానికి అభిమానుల కోరికను ఈ విధంగా తీర్చేయబోతున్నాడు.  అయితే కొంతమంది మాత్రం టాలీవుడ్ లో కాకుండా బాలీవుడ్లో హోస్టుగా చేయడం ఏంటి..? ఇది తారక్ కెరియర్ కి నెగిటివ్ గా మారబోతుంది ఏమో  అంటూ వెటకారంగా కౌంటర్స్ వేస్తున్నారు ...!

మరింత సమాచారం తెలుసుకోండి: