
తెలుగు వాళ్లలో మాత్రం అల్లు అర్జున్ ఒక్కడే ఇండియాటుడే కి బెటర్ ర్యాంకుగా కనిపించారు. పాన్ ఇండియా స్టార్లు గా పేరుపొందినటువంటి అమితాబ్, ఆలియా భట్, కరణ్ జోహార్, షారుక్ ఖాన్ , నేషనల్ క్రష్ గా పేరుపొందిన రష్మికకు కూడా ఈ అవకాశం రాలేదు.. కేవలం ఒక అల్లు అర్జున్ ని మాత్రమే ఈ ఏడాది ప్రభావితవంతమైన నటుడిగా క్యారెక్టర్ కిందన ఎంపిక చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే.. ఇతర హీరోలు పాన్ ఇండియా లెవెల్లో స్టార్ డమ్ ఉన్నప్పటికీ ఇందులో చోటు సంపాదించుకోలేకపోయినట్లు కనిపిస్తోంది.
గత ఏడాది పుష్ప 2 చిత్రంతో సరికొత్త మ్యానురిజాన్ని చూపించిన అల్లు అర్జున్.. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల అల్లు అర్జున్ పేరు మరింత మారుమోగిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కలెక్షన్స్ పరంగా 1800 కోట్లకు పైగా రాబట్టి సరికొత్త రికార్డులను కూడా తిరగరాశారు అల్లు అర్జున్. అందుకే ఈ ఏడాది ప్రభావితవంతమైన నటులలో స్థానాన్ని సంపాదించుకున్నట్లు అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. ఇక తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ అట్లీ లేకపోతే త్రివిక్రమ్ తో చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.