
ఆచార్య సినిమా డిజాస్టర్ తర్వాత చిరంజీవి ఎంతలా హిట్ కోసం తపన పడుతున్నాడు అనేది అందరికీ తెలిసిందే . అయితే "విశ్వంభర" సినిమా తో ఎలాగైనా హిట్ కొడతాడు అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ విశ్వంభర సినిమా మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది . అయితే ఇప్పుడు చిరంజీవికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. చిరంజీవి తన ఇంటికి వచ్చి కధ చెప్పే డైరెక్టర్స్ అందరికీ ఓకే చేసేస్తున్నారట .
కథ ఎలాగున్నా సరే ఆయన కోసం వచ్చిన ప్రతి డైరెక్టర్ కి ఓకే మూవీ చేసేద్దామంటూ ఆఫర్ ఇచ్చేస్తున్నారట. అయితే ఇక్కడే మెగా ఫాన్స్ కి అసలు నచ్చడం లేదు . ఎవరికి పడితే వాళ్లకి డేట్లు ఇచ్చేస్తే మెగాస్టార్ రేంజ్ ఏముంటుంది..? ఆ చి తూచి చిన్న నిర్ణయాలు తీసుకోవాలి అంటున్నారు మెగా ఫ్యాన్స్ . అయితే కొంతమంది మాత్రం మెగాస్టార్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నారు. చిరంజీవి చేసేది చాలా నిజాయితీగల పని అని .. హిట్ ఉన్న డైరెక్టర్లకి హిట్ లేని డైరెక్టర్లకి ఆఫర్లు ఇస్తేనే మెగాస్టార్ రేంజ్ ఎంతవరకు ఉందో తెలుస్తుంది అని చెప్పుకొస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి పేరు వైరల్ గా మారింది. రీసెంట్ గానే రామ్ చరణ్ బర్త డే పార్టీలో మెరిసాడు . చిరంజీవి ఫ్యామిలీతో చాలా బాగా టైమ్ స్పెండ్ చేశారు..!