మలయాళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మోహన్ లాల్ కొన్ని సంవత్సరాల క్రితం లూసిఫర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి పృధ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక లూసిఫర్ మూవీ కి కొనసాగింపుగా తాజాగా పృథ్వీరాజ్ సుకుమరన్ , మోహన్ లాల్ హీరో గా ఎంపురాన్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ ని మార్చి 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ ని మార్చి 27 వ తేదీనే తెలుగు లో కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ మంచి అంచనాల నడుమ రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయినా కూడా ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో గొప్ప టాక్ రాలేదు. దానితో ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బాక్సా ఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ చూపడం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన రెండు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

రెండు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఎంపురాన్ మూవీ కి నైజాం ఏరియాలో 55 లక్షల కలెక్షన్లు దక్కగా , మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 40 లక్షల కలెక్షన్లు దక్కాయి. దానితో మొత్తంగా ఈ సినిమాకు రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 95 లక్షల షేర్ ... 1.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 5.05 కోట్ల షేర్ కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేస్తే టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: